Don't Miss!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆ సినిమా టార్గెట్ రూ. 300 కోట్లు, చిరంజీవితో లింక్!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. వరల్డ్ వైడ్గా 5000 పైచిలుకు స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. విడుదలకు ముందు నుండే మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం తప్పకుండా 300 కోట్లు వసూలు చేసిన క్లబ్బులో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్.
చిరంజీవి తెలుగులో నటించిన 'స్టాలిన్' చిత్రానికి ఇది రీమేక్ కావడంతో ఏపీలో విడుదలయ్యే హిందీ వెర్షన్కు మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. తొలుత ఈచిత్రానికి మెంటల్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ సూచన మేరకు 'జై హో'గా మార్చారు.
జై హో చిత్రం ఒక మంచి సోషల్ మెసేజ్తో తెరెక్కింది. రిపబ్లిక్ డే సందర్బంగా విడుదలైన ఈ చిత్రంలో ప్రజల్లో దేశభక్తి పెంచేలా ఎన్నో సన్నివేశాలున్నాయి. ఈ సినిమా తర్వాత తన స్టార్ ఇమేజ్ రెట్టింపు అవుతుందని సల్మాన్ భావిస్తున్నాడు. ఈచిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన డైసీ షా నటించింది.
ఇంతకు ముందు సల్మాన్ నటించిన చివరి ఐదు సినిమాలు దబాంగ్, రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, దబాంగ్ 2 చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ ఓపెన్సింగ్ సాధించడంతో పాటు......సల్మాన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో 'జై మో' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.