Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
‘దృశ్యం’తో సురేష్ ప్రొడక్షన్స్ 50 ఏళ్ల పండగ
హైదరాబాద్: సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించిన 'దృశ్యం' సినిమా విడుదల సందర్భంగా నిర్మాత సురేష్ బాబు కళ్లలో కొత్త ఆనందం కనిపిస్తోంది. అందుకు కారణం ఈ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడమే. తమ సంస్థ చారిత్రాత్మక మైలు రాయిని అందుకోవడంపై సురేష్ బాబు సంతోషం వ్యక్తం చేసారు.
'దృశ్యం సినిమాతో మేము 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాం. పరిశ్రమలో విజయవంతంగా సంస్థ సుదీర్ఘ ప్రయాణం సాగించడం ఆనందం గా ఉంది. ఈ సుధీర్ఘ ప్రయాణం ఇచ్చిన కాన్ఫిడెన్స్తో మరిన్ని మంచి ప్రాజెక్టులతో ముందుకు సాగుతాం' అని నిర్మాత సురేష్ తెలిపారు.
సురేష్ ప్రొడక్షన్స్ వైవిధ్య సినిమాల నిర్మాణానికి కేరాఫ్ గా నిలిచిన సంస్థ. ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నిన్నటి వెంకటేష్, చిరంజీవి, నేటి కుర్రహీరోల వరకు మూడు తరాల హీరోలతో సినిమాలు చేసిన నిర్మాణ సంస్థ. తెలుగులో దాదాపు అందరు హీరోలతో సోలో, మల్టీస్టారర్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ అత్యధిక సక్సెస్ రేటుతో టాలీవుడ్ కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్లింది.
'దృశ్యం' సినిమా విషయానికొస్తే...మళయాళంలో సూపర్హిట్ అయిన 'దృశ్యం' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో వెంకటేష్, మీనా జంటగా నటించారు. డి.రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్ ప్రై.లిమిటెడ్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై.లిమిటెడ్ పతాకాలపై సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్వకత్వంలో డి.సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.