Just In
- just now
ఆదిపురుష్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సీత పాత్రలో బ్యూటీఫుల్ హీరోయిన్
- 6 min ago
‘సింహాద్రి’ విజయంలో ఆయనదే కీలక పాత్ర: నిర్మాత మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
- 39 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 58 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
Don't Miss!
- News
అర్నబ్తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
- Lifestyle
Mercury Transit in Aquarius : బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జర భద్రం...!
- Finance
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో భారీ స్కాం: వైస్ ఛైర్మన్ జైలుపాలు: కార్పొరేట్ సెక్టార్ షేక్
- Automobiles
సరికొత్త జావా ఫోర్టీ టూ మోడల్ వస్తోంది.. స్పై చిత్రాలు, వివరాలు
- Sports
మ్యాచ్కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరు ‘యముడికి మొగుడు’ 25 (స్పెషల్ ఫోకస్)
హైదరాబాద్ : చిరంజీవి హీరోగా అప్పట్లో వచ్చిన 'యముడికి మొగుడు' చిత్రం ఏ రేంజిలో హిట్టయింతో కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్లీ చూడాలనిపిస్తుంది. ఇప్పటికీ టీవీల్లో ఆ సినిమా వస్తుందంటే ఆసక్తిగా చూసే వారు ఎంతో మంది. పూర్తి వినోదాత్మకంగా ఉండటమే ఈ చిత్రం ప్రత్యేకత. ఏప్రిల్ 29, 1988లో విడుదలైన ఆ సినిమా వచ్చి నేటికి పాతికేళ్లయింది.
చిరంజీవి, రాధ, విజయశాంతి, కైకాల సత్యనారాయణ, రావుగోపాల్ రావు, అల్లు రామలింగయ్య, సుత్తివేలు, సుధాకర్, గొల్లపూడి తారాగణంగా రూపొందిన ఈచిత్రానికి రవిరాజా పనిశెట్టి దర్శకత్వం వహించారు. సుధాకర్, నారాయణరావు, హరి ప్రసాద్ సంయుక్తంగా 'డైనమిక్ మూవీమేకర్స్' అనే సంస్థను నెలకొల్పి ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లోనే ఈచిత్రానికి కోటి పాతికలక్షలు ఖర్చయింది.
చిరంజీవి సినిమా అవకాశాల కోసం చెన్నైలో తిరుగుతున్న రోజుల నుంచి సుధాకర్, నారాయణరావు, హరి ప్రసాద్ లతో స్నేహం ఉంది. ఈ స్నేహం కారణంగానే చిరంజీవి వారికి సినిమా తీసే అవకాశం ఇచ్చారు. సినిమా తీద్దామని అంతా డిసైడ్ అయ్యాక కథకోసం అన్వేషణ ప్రారంభించారు.
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అనే అంశానికి యముడి నేపథ్యాన్ని జోడించి సత్యానంద్ కథ తయారు చేసారు. కథ, స్క్రిప్టు అద్భుతంగా కుదింది. కాళీ, బాలుగా ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసారు. కొందరి కుట్ర కారణంగా బలైపోయిన కాళి యమలోకానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లాక తన ఆయువు తీరలేదని తెలుసుకుని యమున్ని ముప్పతిప్పలు పెడతాడు. కాళి గోల భరించలేక అతని ఆత్మను బాలు శరీరంలోకి పంపిస్తారు. అమాయకుడైన బాలు శరీరంలో చేరిన కాళీ విలన్స్ పని పడతాడు. ఇలా పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది.
ఇక ఈ సినిమాకు రాజ్-కోటి అందించిన సంగీతం హైలెట్ అయింది. ఈచిత్రంలో పాటలన్నీ హిట్ కావడానికి తోడు, చిరంజీవి బ్రేక్ డాన్స్ స్టెప్పులు సినిమా ఓ రేంజికి వెళ్లింది. దీంతో అప్పటి వరకు వచ్చిన చిరంజీవి సినిమాలన్నింటికంటే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది 'యముడికి మొగుడు'. అప్పటి వరకు విలన్ పాత్రలకే పరిమితం అయిన సుధాకర్ ఈ చిత్రంతో కెమెడీయన్ గా పాపులర్ అయ్యాడు. రాజ్-కోటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు.