Don't Miss!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ప్రభాస్తో పెళ్లి వార్తలు: కేసులు పెడతానంటూ అనుష్క వార్నింగ్!
ఇకపై ఎవరైనా గాసిప్స్ రాస్తే కేసులు పెడతానంటూ హీరోయిన్ అనుష్క పరోక్షంగా హెచ్చరించింది.
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె లవ్ ఎఫైర్స్ గురించి, పెళ్లి గురించి రకరకాల గాసిప్స్. ఇంతకాలం తన గురించి ఎన్ని రాస్తున్నా సహనంతో భరించిన అనుష్క ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది.
తనపై ఇకపై లేనిపోని వార్తలు రాస్తే ఎంత మాత్రం ఊరుకోను, ఇలాంటివి రాసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని అనుష్క హెచ్చరించింది. ఎప్పుడూ లేనిది అనుష్క ఇంతలా ఆగ్రహానికి గురి కావడం చర్చనీయాంశం అయింది.
బాహుబలి-2 తర్వాత ప్రభాస్తో లింకప్
బాహుబలి-2 విడుదల తర్వాత అనుష్క పెళ్లి గురించి ఈ వార్తల జోరు మరింత పెరిగింది. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని, బాహుబలి షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
కేవలం స్నేహం మాత్రమే
ప్రభాస్ తో పెళ్లి వార్తలపై అనుష్క ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ....తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని, ఇలాంటి గాలి వార్తలు నమ్మవద్దని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
ఆగని ప్రచారం
అయితే అనుష్క మీడియా ముఖంగా తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని తేల్చి చెప్పినా ఆ వార్తలు మాత్రం ఆగలేదు. కొందరు తన గురించి నీచంగా రాస్తూ తన ఇమేజ్ దెబ్బతీస్తుండటంతో అనుష్క తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
వార్నింగ్
తనపై జరుగుతున్న ప్రచారం కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా నష్టం చేకూర్చే విధంగా ఉండటంతో అనుష్క సహనం కోల్పోయింది. అందుకే ఇకపై ఎవరైనా ఎక్స్ట్రాలు రాస్తే కేసులు పెడతానంటూ పరోక్షంగా హెచ్చరించింది.