Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వైఎస్ఆర్ బయోపిక్లో సుహాసిని, పోసాని.. ఏ పాత్ర కోసమంటే..
టాలీవుడ్లో బయోపిక్స్ క్రేజ్ మొదలైంది. మహానటి ఘన విజయం తర్వాత ఎన్టీఆర్, వైఎస్ఆర్, పుల్లెల గోపిచంద్ బయోపిక్స్ రూపొందుతున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వైఎస్ఆర్గా మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కనిపించనున్నారు.
వైఎస్ఆర్ బయోపిక్కు సంబంధించిన నటీనటుల ఎంపిక వేగం పుంజుకొన్నది. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ పాత్రకు అశ్రిత వేముగంటిని ఎంపిక చేసినట్టు వార్తలు వెలువడుతున్నప్పటికీ.. అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ధృవీకరణ జరుగలేదు. ఇక వైఎస్ఆర్ జీవితంలో చేవెళ్ల చెల్లమ్మ సబితా ఇంద్రారెడ్డి పాత్ర కీలకమైంది.
వైఎస్ఆర్ ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టినా చేవెళ్ల నుంచి ప్రారంభించే వారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన సబితా ఇంద్రారెడ్డి పాత్ర కోసం విలక్షణ నటి సుహాసిని ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. ఇక వైఎస్ఆర్కు నమ్మినబంటు అని పేరు తెచ్చుకొన్న సూరీడు పాత్రకు పోసాని కృష్ణమురళీ ఎంపికైనట్టు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ బయోపిక్కు యాత్ర అనే టైటిల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.