సాయిధరమ్ తేజ్ 'రేయ్' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్' . షూటింగ్ లేటైనా ట్రేడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ చిత్రం గురించి వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్ఫుడ్ తరహా లవ్స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది. ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్లో కొంత భాగం, హైదరాబాద్లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

ఆ మెసేజ్ లో.... 'జయాపజయాలు నాకు ముఖ్యం కాదు.. వ్యక్తిత్వం, అంకితభావం నాకు ముఖ్యం. మీ కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. అందుకే ఎటువంటి సంకోచం లేకుండా ముందుడుగు వెయ్యండి. మీకు అండగా నేనున్నాను...' అంటూ ఇచ్చారు. ఆ రోజు పవన్కళ్యాణ్గారు ఇచ్చిన మెసేజ్ నాకు ప్రోత్సాహాన్నిచ్చి, ఎక్కడా రాజీపడకుండా 'రేయ్' సినిమాని తీసేలా చేసింది.
నా 28 ఏళ్ల సినీజీవితంలో దర్శకుడు అపజయాల్లో ఉన్పప్పుడు ఓ స్టార్ హీరో నుంచి ఇటువంటి మెసేజ్ అందుకోవడం ఇదే ప్రథమం. అందుకు ఈ సందర్భంగా వపన్కళ్యాణ్గారికి హాట్సాఫ్ చెబుతున్నా అన్నారు. నరేశ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్రెడ్డి, తనికెళ్ల భరణి, వేణుమాధవ్, రఘుబాబు, హేమ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సాహిత్యం: చంద్రబోస్.


Click it and Unblock the Notifications











