Just In
- 24 min ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 1 hr ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 1 hr ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
- 2 hrs ago
చిత్ర సీమలో విషాదం.. నిర్మాత మృతిపై నారా రోహిత్, సుధీర్ వర్మ ఎమోషనల్
Don't Miss!
- News
రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
- Sports
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే.. ఆసియాకప్ వాయిదా తప్పదు!
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మంత్రి బైకెక్కిన యంగ్ హీరోయిన్.. రోడ్లపై షికారు చేస్తూ! ఇదీ మ్యాటర్..
తెలంగాణ రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బైక్పై యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా షికార్లు కొట్టింది. ఇద్దరూ కలిసి బైక్పై అలా వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మంత్రి బైక్ హీరోయిన్ ఈషా రెబ్బా ఎందుకు ఎక్కవలసి వచ్చింది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

రోడ్డు భద్రత వారోత్సవాలు
రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనదారులు పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించేందుకు గాను రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వారోత్సవాల్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బైక్ ఎక్కింది హీరోయిన్ ఈషా రెబ్బా.

ప్రత్యేక ఆకర్షణ హీరోయిన్ ఈషా రెబ్బా
జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా సోమవారం హెచ్ఎమ్డీఏ మైదానంలో వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఈషా రెబ్బా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మంత్రి పువ్వాడ అజయ్.. వెనుక సీట్లో యంగ్ హీరోయిన్
ఇక ఈ వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు ఎలాంటి భద్రతా నియమాలను పాటించాలో వివరించారు. ఈ విషయమై అవగాహన కల్పించడంలో భాగంగా స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవింగ్ చేశారు. ఆయన వెనుక సీట్లో హీరోయిన్ ఈషా రెబ్బా కూడా హెల్మెట్ ధరించి కూర్చుంది.

ఇలా చేస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యం
ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ''రోజు రోజుకూ సమాజంలో వాహనాల సంఖ్య పెరగడంతో పాటు రోడ్డు యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెంట్ను ధరించాలి. కారు లాంటి భారీ వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవాలి. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అందరూ ట్రాఫ్డిక్ రూల్స్ పాటించాలి. అప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యం'' అని చెప్పారు.