Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Siddharth చెన్నై పోలీసుల సమన్లు.. ముదిరిన సైనా నెహ్వాల్ ట్వీట్ వివాదం
పాపులర్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ట్వీట్పై వివాదాస్పద కామెంట్ చేసిన సినీ నటుడు సిద్దార్థ్కు ఊహించినట్టే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ ట్వీట్ వివాదంలో సిద్దార్థ్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. తాజాగా మరో రెండు కేసులు నమోదు కావడంతో చెన్నై నగర పోలీసులు తీవ్రంగా స్పందించారు. సిద్దార్థ్కు ఈ వివాదంపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేశారు. అయితే సైనా నెహ్వాల్, సిద్దార్థ్ మధ్య చోటు చేసుకొన్న వివాదం ఏమిటంటే..
Recommended Video
పంజాబ్ పర్యటనలో ప్రధానికి చేదు అనుభవం
కొద్ది
రోజుల
క్రితం
పంజాబ్లో
పర్యటన
సందర్భంగా
ప్రధాని
నరేంద్ర
మోదీ
కాన్వాయ్లో
భద్రతా
వైఫల్యం
ఏర్పడం
అత్యంత
వివాదంగా
మారింది.
ప్రధాని
కాన్వాయ్కే
రక్షణ
లేకపోవడమేమటంటూ
జాతీయ
స్థాయిలో
చర్చనీయాంశమైంది.
ఈ
ఘటన
ట్వీట్టర్లో
బాడ్మింటన్
క్రీడాకారిణి
సైనా
నెహ్వాల్
స్పందించారు.
ప్రధాని
భద్రత
విషయంలో
రాజీ
పడితే..
ఏ
దేశం
కూడా
సురక్షితంగా
ఉన్నట్టు
అనిపించుకోదు.
ప్రధాని
మోదీపై
పిరికిపందల
దాడిని
తీవ్రంగా
వ్యతిరేకించాలి.
మోదీకి
దేశ
ప్రజలు
మద్దతుగా
ఉండాలి
అంటూ
#BharatStandsWithModi
#PMModi
సైనా
నెహ్వాల్
ట్వీట్
చేసింది.
సైనా నెహ్వాల్ ట్వీట్పై సిద్దార్థ్ రియాక్షన్
ప్రధాని
మోదీకి
సపోర్ట్గా
నిలిచిన
సైనా
నెహ్వాల్
చేసిన
ట్వీట్పై
సిద్దార్థ్
సెటైరికల్గా
స్పందించారు.
సైనా
నెహ్వాల్ను
ఉద్దేశిస్తూ..
సటిల్
కాక్
ఛాంపియన్
ఆఫ్
ది
వరల్డ్..
ఇండియాకు
రక్షణగా
నిలిచే
వారున్నందుకు
దేవుడికి
థ్యాంక్
చెప్పుకోవాలి.
షేమ్
ఆన్
యూ
రిహన్నా
అని
సిద్దార్థ్
ట్వీట్
చేశారు.
అయితే
Subtle
Cock
అనే
పదాలు
ఉపయోగించడం
మహిళలను
బూతులు
తిట్టడమే..
మహిళలపట్ల
సిద్దార్థ్
ఇలాంటి
పదాలు
వాడటం
సరికాదు
అంటూ
నెటిజన్లు
దుయ్యబట్టారు.
తన ట్వీట్ను సమర్ధించుకొన్న సిద్ధార్థ్
సైనా
నెహ్వాల్పై
చేసిన
ట్వీట్
వివాదం
కావడం,
అలాగే
మహిళలు,
నెటిజన్లు
ఘాటుగా
స్పందించడంతో
సిద్ధార్థ్
మరో
ట్వీట్
చేశారు.
తాను
చేసిన
ట్వీట్
సరైనదే.
కాక్
అండ్
బుల్
అనే
పదాలు
ఉదాహరణకు
తీసుకోవడం
తప్పేమీ
కాదు.
నా
ట్వీట్లో
ఎలాంటి
బూతు
గానీ,
మహిళలను
అవమానించే
విధంగా
పదాలు
లేవు
అనే
విధంగా
సిద్దార్థ్
మరో
ట్వీట్
చేస్తూ
సమర్ధించుకొన్నారు.
చెన్నైలో సిద్దార్థ్పై కేసులు నమోదు
సిద్దార్థ్
చేసిన
ట్వీట్పై
హైదరాబాద్లో
ఓ
మహిళ
సైబర్
క్రైమ్
ఫిర్యాదు
చేయడంతో
కేసు
నమోదు
చేశారు.
ఐపీసీ
సెక్షన్
509
తోపాటు
ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ
యాక్ట్
కింద
కూడా
కొన్ని
సెక్షన్లతో
కేసు
నమోదు
చేశారు.
ఇక
చెన్నైలో
కూడా
సిద్దార్థ్పై
కేసులు
నమోదయ్యాయి.
దాంతో
ఈ
సిద్దార్థ్కు
సమన్లు
జారీ
చేశాం
అని
చెన్నై
పోలీస్
కమిషనర్
శంకర్
జైస్వాల్
మీడియాకు
వెల్లడించారు.
సమన్లు జారీ చేశాం.. స్టేట్మెంట్ తీసుకొంటాం
సిద్ధార్థ్ వ్యవహారంపై చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జైస్వాల్ మీడియా మాట్లాడుతూ.. మాకు రెండు ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. మరో ఫిర్యాదు పరువు నష్టం కేసు నమోదైంది. ఈ విషయంలో ఇప్పటికే సిద్ధార్థ్కు సమన్లు జారీ చేశాం. కోవిడ్ పరిస్థితులు నెలకొనడంతో ఆయన నుంచి స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలనే విషయాన్ని ఆలోచిస్తున్నాం శంకర్ జైస్వాల్ తెలిపారు.