మినిస్టర్ దగ్గర కొట్టేసిన 500 కోట్లులో నాకు షేర్ వద్దు: హీరో కార్తీ

మినిస్టర్ వద్ద కొట్టేసిన ఆ ఐదు వందల కోట్లు డబ్బులో నాకు షేర్ వద్దు అంటూ ట్వీట్ చేసారు తమిళ హీరో కార్తి.

By Srikanya

చెన్నై: మినిస్టర్ వద్ద కొట్టేసిన ఆ ఐదు వందల కోట్లు డబ్బులో నాకు షేర్ వద్దు అంటున్నారు తమిళ హీరో కార్తి. అయితే ఇది సరదాకేనండోయ్. కమిడియన్ వివేక్ పుట్టిన రోజు సందర్బంగా కార్తీ ఈ విధంగా ట్వీట్ చేసి అందరినీ నవ్వించారు. అవును ఈ ఐదు వందలకోట్లు అనగానే మీకు ఏం గుర్తుకు వస్తోంది. ఏం గుర్తుకురావటం లేదా...పోన్లెండి అంత శ్రమ వద్దు నేనే చెప్పేస్తాను.

రీసెంట్ గా కార్తీ హీరోగా కాశ్మోరా చిత్రం వచ్చింది కదా. అందులో కార్తికి తండ్రిగా వివేక్ చేసారు. తండ్రి, కొడుకులిద్దరూ కలిసి జనాలని మాయలు, మంత్రాలు అంటూ బురిడికొట్టించి డబ్బులు నొక్కేస్తూంటారు. వీళ్లు తమ టాలెంట్ తో ఓ మినిస్టర్ ని సైతం నమ్మించేస్తూంటారు. అలా వీళ్ల మాయలో పడ్డ ఓ మినిస్టర్..తమ మీద ఇనకం టాక్స్ వాళ్లు దాడి చేస్తున్నారనే భయంతో..ఓ ఐదు వందల కోట్లు...హీరో ఇంట్లో దాస్తారు.

I don't want share in that Rs. 500 crore Vivekh: Tweets Karthi

అది చూసిన హీరో తండ్రి వివేక్..ఆ డబ్బుతో జంప్ అవ్వాలనుకుంటారు. అక్కడ నుంచి వాళ్లకు వచ్చే తిప్పలే కాశ్మోరా కథ. సినిమా చివరి వరకూ ఆ మినిస్టర్ నా ఐదు వందలు కోట్లు అంటూ తిరుగుతూంటాడు. చివర్లో కూడా ఐదు వందల కోట్ల మీద పంచ్ ఉంటుంది. అదీ మ్యాటర్ . ఇవన్నీ గుర్తు పెట్టుకునే కార్తీ..సరదాగా ఇదిలో ఇలా ట్వీట్ చేసి పుట్టిన రోజున నవ్వించేసాడు.

ఇక ఈ ట్వీట్ చూసిన కార్తీ ఫ్యాన్స్ ...తెగ రిప్లైలు ఇస్తున్నారు. కార్తీలోని ఫన్నీ నేచర్ కు, తోటి ఆర్టిస్ట్ లకు ఆయన ఇచ్చే గౌరవానికి ఇది ఓ ఉదాహరణ అని తమిళ మీడియా అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X