Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరో తీరుపై మండిపడుతున్న ఇళయరాజా
ఇళయరాజా స్వరపర్చిన గీతాలకు ఇప్పటికీ తరగని ఆదరణ ఉంది. వాటిల్లో కొన్నింటిని కొత్త సంగీత దర్శకులు రీమిక్స్గా ఉపయోగిస్తుంటారు. తాజాగా దర్శక నటుడు శశికుమార్ తన కొత్త చిత్రం 'కుట్టిపులి'లో ఇళయరాజా స్వరపర్చిన రెండు పాటలను వినియోగించుకున్నాడు.
ప్రేక్షకులను నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇళయరాజా మాత్రం ఈ విషయంలో శశికుమార్ తీరును తప్పుపట్టారు. ఆ పాటల్ని చిత్రంలో ఉపయోగించుకునేందుకు స్వరకర్తగా తన అనుమతిని తీసుకోలేదన్నాడు.
నటుడిగా, దర్శకుడిగా శశికుమార్ తొలిచిత్రం 'సుబ్రమణ్యపురం' సంచలన పేరు సొంతం చేసుకుంది. ఆపై సముద్రఖని దర్శకత్వంలో 'నాడోడిగల్'లో ప్రధానపాత్ర పోషించాడు. అది మంచి వసూళ్లు రాబట్టింది. ఆపై 'పసంగ', 'పోరాళి'లో నటించిన శశికుమార్ చివరగా ప్రభాకరన్ దర్శకత్వంలో 'సుందరపాండియన్'లో కనిపించాడు. ఇదికూడా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. గత ఏడాది ఘన విజయం అందుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. తాజాగా 'కుట్టిపులి'లో నటిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం శశికుమార్ నటించి,నిర్మించిన సుందరపాండ్యన్ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. తెలుగులో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు.