Just In
- 8 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్లో నలుగురు దర్శకులు!
- 9 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విడుదల ముందే: బాలచందర్ ఆరోగ్యంపై కమల్ హాసన్
చెన్నై: ప్రముఖ సీనియర్ దర్శకుడు బాలచందర్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. 84 సంవత్సరాల ఆయన వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ద్వారా సినిమా రంగానికి పరిచయమైన పలువురు స్టార్స్ ఆయన్ను ఆసుపత్రికి వచ్చి పరామర్శించి వెలుతున్నారు. ఇప్పటికే రజనీకాంత్ చెన్నైలోని ఆయన ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు.
ఆయన శిష్యుల్లో ఒకరైన కమల్ హాసన్ ప్రస్తుతం 'ఉత్తమ్ విలన్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనిపై లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. బాలచందర్ ఆసుపత్రిలో చేరుకున్న విషయం తెలుసుకుని వెంటనే ఆయన మేనేజనర్ కు ఫోన్ చేసి మాట్లాడారట. ఈ మేరకు తన గురువు ఆరోగ్యంపై ఓ వీడియోలో కమల్ మాట్లాడారు. "'ఉత్తమ్ విలన్' చాలా త్వరగా పూర్తి చేయాలని ఇటీవల బాలచందర్ సర్ నన్నడిగారు. విడుదలకముందే ఆ సినిమా చూడాలనుకుంటున్నానని చెప్పినట్లు వెల్లడించారు.

బాల సర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే ఆయన మేనేజనర్ కు ఫోన్ చేశాను. స్పృహలో లేరని, కొన్ని రోజుల నుంచి ఎవరితో మాట్లాడటంలేదని చెప్పారు. అయినప్పటికీ ఫోన్ లో నేను పలకరించినప్పుడు తన పేల గొంతుతో స్పందించారు. పని పూర్తి చేసుకుని త్వరలో మిమ్మల్ని చూసేందుకు వస్తానని చెప్పాను. ఆయన త్వరగా కోలు కోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ప్రస్తుతం చెన్నై ఆల్వార్ లోని కావేరీ ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.