రజనీకాంత్ ప్రథానపాత్రలో పి.వాసు నిర్మిస్తోన్న 'కథానాయుకుడు' ఆడియో ఈ రోజు సాయింత్రం జరగనుంది. వెన్యూ చెన్నై లోని Le Meridian హోటల్. తెలుగు,తమిళ వెర్షన్స్ రెండింటి ఆడియోనీ ఒకే వేదికపై ఆవిష్కరించనున్నారు. బిగ్ మ్యూజిక్ వారు ఆడియో రైట్స్ ని భారీ మొత్తం 2.5 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండియన్ సినిమాకు ఈ రేటు బాగా ఎక్కువ. ఇక సంగీత దర్శకుడుగా ఎ.ఆర్.రహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ తొలిసారిగా పరిచయం చేస్తున్నారు. రజనీ బాల్య మిత్రుడుగా తెలుగుకి జగపతి బాబు,తమిళానికి పశుపతి చేస్తున్నారు. చలసాని అశ్వనీదత్ తెలుగు వెర్షన్ కి నిర్మాతగా వ్యవహరించనున్నారు. అలాగే ఈ సినిమా 'కథా పెరియంబోల్' అమే మళయాళ చిత్రానికి రీమేక్.