Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
సునంద హత్య గురించేనా? నటి కుష్భూ తీరుపై దర్శకుడి ఫైర్..!
హైదరాబాద్: నటి కుష్భూపై తమిళ దర్శకుడు ఎఎం రమేష్ మండి పడ్డారు. కుష్బూ తన సినిమా విషయంలో జోక్యం చేసుకోవడం, తన సినిమాకు సంబంధించిన స్టోరీ చెప్పాలని తమను వేధించడం, తమ యూనిట్ సభ్యులను ఈ విషయాల గురించి అడుగుతున్నారని మండి పడ్డారు.
ప్రస్తుతం ఎఎం రమేష్ ‘ఒరు మెల్లికొడు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మాజీ కేంద్రమంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ హత్యోదంతం గురించే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పిఆర్ఓగా ఉన్న కుష్బూ ఈ చిత్రం కథాంశం ఏమిటనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోందని, స్టోరీ చెప్పాలని యూనిట్ సభ్యులను వేధిస్తోందనే ప్రచారం జరుగుతోంది.
కుష్బూ తన చిత్ర యూనిట్ సభ్యులను స్టోరీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు...ఏ దర్శకుడు, నటుడు తన చిత్ర కథ గురించి బయటకు చెప్పరన్నారు. అయినా కుష్బూ తన యూనిట్ సభ్యులనేు అడిగే బదులు తననే అడగవచ్చారు. నా సినిమా ఓ హత్యోదంతం గురించే, ఇందులో మనీషా కొయిరాలా హత్యకు గురవుతారు. ఆ హత్య గురించి జరిగే ఇన్వెస్టిగేషనే ఈ చిత్రం అన్నారు.
కాగా.... ఎఎం రమేష్ ఆరోపణలను నటి కుష్భూ ఖండించారు. సునంద పుష్కర్ హత్యోదంతం గురించే సినిమా తీస్తున్నారా? అనే విషయాలు తాను ఎవరినీ అడగలేదన్నారు. ఈ విషయంలో తన గురించి అసత్య ప్రచారం జరుగుతోందని కుష్భూ స్పష్టం చేసారు. అర్జున్ భార్య ఈ చిత్రంలో నటించాలని అడిగారని, తాను సినిమాలకు దూరంగా ఉంటున్న విషయాన్నే చెప్పాను, అంతకు మించి మరేమీ లేదు అన్నారు.