పబ్లిక్ లో చొక్కా విప్పి, దమ్ము కొట్టిన బాలయ్య...దేనికి సంకేతం? ఏమిటా ధీమా?
చెన్నై: హిందూపూర్ ఎమ్మల్యే, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదాన్ని కొనితెచ్చుకోబోతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా ఆయన స్త్రీలపై ఆయన చేసిన కామెంట్స్ తో ఆయన అంతటా వివాదాస్పదమయ్యారు.
నారా రోహిత్...రీసెంట్ చిత్రం సావిత్రి ఆడియో ఫంక్షన్ సమయంలో ఆయన చేసిన కామెంట్స్ అంతటా చర్చయనీయాంసమయ్యాయి. నేషనల్ మీడియా ఆయన్ను వల్గర్ స్టార్ అని పిలిచింది. నెట్ జనలు ఆయనపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు మీడియా వద్ద ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సైతం అందరినీ నోరు వెళ్లబెట్టుకునేలా చేసాయి.
ఇది ఇలా ఉంటే లేటెస్ట్ గా ఆయన పబ్లిక్ ప్లేస్ లో స్మోమింగ్ చేస్తూ కనపడ్డారు. చెన్నైలో నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ కు ఆయన హాజరై క్రికెట్ స్టేడియంలో సిగరెట్ కాల్చారు. అక్కడ వేడికి తట్టుకోలేక ఆయన పై ఉన్న షర్ట్ తీసి సిగెరెట్ దమ్ము వదులతూ కనపడ్డారు. పబ్లిక్ లో ఇలా సిగరెట్ కాల్చటం , అదీ ఓ సెలబ్రెటీ అయ్యి ఎంతవరకూ సబబు అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ దారి తీస్తుందో చూడాలి.
చెన్నైలో ఆదివారం తమిళ సినిమా తారలు క్రికెట్ ఆడి సందడి చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ భారత నటుల సంఘం భవన నిర్మాణం కోసం నిధులు సమీకరించడానికి ఈ తారల క్రికెట్ పోటీలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ..నగరంలో తమిళ తారల క్రికెట్ పోటీ ఆదివారం కోలాహలగా ప్రారంభమైంది. తారల ఆటను ఆస్వాదించడానికి నగర వాసులు, క్రీడాభిమానులు భారీగా తరలిరావడంతో చేపాక్కం క్రీడామైదానం పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి.
సూర్య, విశాల్, కార్తి, జయం రవి, విజయ్ సేతుపతి, జీవా, శివ కార్తికేయన్, ఆర్య నాయకత్వంలోని ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను తిలకించడానికి దక్షిణాది సినిమా తారలు తరలివచ్చారు.
తెలుగు నుంచి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా, రానా తదితరులు పాల్గొన్నారు. ఈ ఆట మొత్తం చాలా ఉత్కంఠగా, అబిమానుల చప్పట్లు, విజిల్స్ తో కోలాహలంగా జరిగింది.
స్లైడ్ షోలో అందుకు సంభందించిన ఫొటోలు చూడండి...

భవణ నిర్మాణానికి
దక్షిణభారత నటుల సంఘం భవన నిర్మాణానికి నిధుల సమీకరణ నిమిత్తమే ఈ క్రికెట్ పోటిని నిర్వహించారు.

ఉదయం నుంచీ..
చెన్నై చేపాక్కంలోని మైదానంలో ఉదయం పది గంటలకు ఈ పోటీలు ప్రారంభం అయ్యాయి.

టాస్ వేసి...
కాగా వాటిని సీనియర్ నటులు రజనీకాంత్, కమలహాసన్ టాస్ వేసి ప్రారంభించారు.

ఎనిమిది జట్లు
ఈ క్రికెట్ మ్యాచ్ లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి.

జట్లు లీడర్స్
సూర్య, విశాల్, కార్తి, జయం రవి, విజయ్ సేతుపతి, జీవా, శివకార్తికేయన్, ఆర్య నాయకత్వంలోని ఎనిమిది జట్లు పాల్గొన్నాయి.

ఎన్నింటికి స్టార్ట్
ఉదయం 10.10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమైంది.

తొలిగా..
సూర్య నాయకత్వంలోని చెన్నై జట్టు, శివకార్తికేయన్ నాయకత్వంలోని తిరుచ్చి జట్టు తలపడ్డాయి

టాస్ గెలిచి
టాస్ను గెలిచిన సూర్య బౌలింగ్ను ఎంచుకున్నారు.

ఈ స్టార్స్ ఇద్దరూ..
ఈ మ్యాచ్లను స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ టాస్ వేసి ప్రారంభించారు.

రజనీ మాట్లాడుతూ..
... క్రికెట్ కోసం అందరూ ఒకే చోటకు చేరడం ఆనందాన్ని కలిగిస్తోందని, యువకుల ఈ ప్రయత్నం అభినందనీయమని అభినందించారు.

తెలుగు నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...
నటుల సంఘం భవన నిర్మాణం కోసం యువకులంతా సంయుక్తంగా క్రికెట్ పోటీలు జరపడం సంతోషకరమని తెలిపారు. ఇది ఆహ్వానించదగిన విషయమన్నారు.

కార్యక్రమంలో...
నటుల సంఘం అధ్యక్షులు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షులు పొన్వణ్ణన్, ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు.

భారీగా
తమ అభిమాన తారలు క్రికెట్ ఆడటాన్ని చూసేందుకు భారీగా అభిమానులు చైపాక్కం మైదానం వద్దకు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం చోటుచేసుకుంది.

పోలీస్ బలగం..
భద్రతా నిమిత్తం సుమారు వందమంది పోలీసులు అక్కడ మోహరించారు.

తెలుగు పరిశ్రమ నుంచి...
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా, రానా తదితరులు పాల్గొన్నారు


Click it and Unblock the Notifications











