Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'చెత్త కథలు..సిల్లీ సినిమాలు' కలవరపెడుతున్న ప్రియమణి కామెంట్స్
ఈ మధ్యన రిలీజైన చాలా సినిమా కథలు వినటానికే చాలా సిల్లీగా ఉంటున్నాయి. అలాగే కథలు కూడా చెత్తగా ఉంటున్నాయి. ఈ మధ్యన మంచి వేషమంటూ కొందరు నిర్మాతలు వచ్చారు. అయితే వారి కథలు విన్నాక వాటిని ఎంత రెమ్యునేషన్ ఇచ్చినా ఒప్పుకోకూడదని ఫిక్సయ్యా" అంటోంది ప్రియమణి. అయితే ఈ మాటలు చెప్పేది ఆమె తమిళ సినిమాలను ఉద్దేశించి . దాంతో ఆమెపై తమిళులు మండిపడుతున్నారు. జాతీయ అవార్డు పొందిన పరుత్తి వీరన్ తమిళ చిత్రం కాదా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే తెలుగు, కన్నడ,మళయాళ చిత్రాలు చేస్తున్న ఆమెకు తమిళంలో ఒక్క సినిమా కూడా లేదు. ఆ అక్కసుతోనే ఆమె ఇలా కామెంట్ చేసిందంటున్నారు. ఇక ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని నటించి న రక్త చరిత్ర చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రియమణి నటించిన రగడ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది. అలాగే వియన్ ఆదిత్య దర్శకత్వంలో సుమంత్ సరసన ఆమె చేసిన రాజ్ చిత్రం కూడా షూటింగ్ పూర్తయింది. వీటితో పాటు ఆమె క్షేత్రం అనే చిత్రంలోనూ చేస్తోంది.