twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లెజెండ్’ హీరోయిన్‌ రాధిక ఆప్టేపై దాడి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రక్త చరిత్ర' సినిమాలో పరిటాల సునీత పాత్రలో....బాలీవుడ్ నటి రాధిక ఆప్టే నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బాలయ్య హీరోగా వచ్చిన 'లెజెండ్' చిత్రంలో కూడా నటించింది. తాజాగా రాధిక ఆప్టే గురించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో ఇండియా, పాకిస్థాన్ బోర్డర్లో షూటింగ్ జరుగుతుండగా ఆమెతో పాటు చిత్ర యూనిట్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం ఆమె ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. అజ్మల్, రాధికా ఆప్తే జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'వెట్రి సెల్వన్'. ఎస్.నాగరాజన్, కె.సురేష్ బాబులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ కాశ్మీర్‌లోని బెహర్‌గామ్, గాబామార్గ్, శ్రీనగర్ మొదలగు ప్రాంతాల్లో నిర్వహిస్తుండగా యూనిట్‌పై దాడి జరిగింది.

     Radhika Apte got troubles at country boarder

    దాడి విషయాన్ని దర్శకుడు వివరిస్తూ...బెహల్‌గామ్‌లో నటి రాధిక ఆప్తే సన్నివేసాలు చిత్రీకరిస్తుండగా ఆ ప్రాంతానికి చెందిన వారు షూటింగ్‌ను వ్యతిరేకించారన్నారు. భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తున్నారేమిటి? అంటూ ఆగ్రహంతో యూనిట్‌పై దాడి చేశారని చెప్పారు.

    దిక్కుతోచని పరిస్థితిలో ఆ ప్రాంతంలోని సిక్కులు తమను రక్షించి కారులో సురక్షితంగా పంపించారని వివరించారు. తాము ఇండియా సరిహద్దులోనే షూటింగ్ చేశామని, అయినా అక్కడి వాళ్లు పాకిస్తానీయుల మాదిరి గొడవపడి దాడికి పాల్పడ్డారని చెప్పారు.

    English summary
    Radhika Apte got troubles at country boarder
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X