Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ దేశంలో పని పూర్తిచేసిన త్రిష.. ఇక మెగాస్టార్స్తోనే తరువాయి
ఒకానొక సమయంలో టాలీవుడ్ని ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ త్రిష. తెలుగు చిత్రసీమలోని అందరు అగ్రహీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో వరుస ఆఫర్స్ పెట్టేస్తూ జోష్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తన తాజా సినిమా 'రాంగీ' షూటింగ్ ఫినిష్ చేసుకొని తన పని పూర్తిచేసుకున్నా అని చెబుతోంది.
ఎం. శరవణన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాంగీ' మూవీ షూటింగ్ కోసం రెండు సార్లు ఉబ్జెకిస్తాన్కు వెళ్ళింది త్రిష. మొదటిసారి వెళ్లినప్పుడు కొన్ని యాక్షన్ సీక్వెన్స్తో పాటు, పోలీస్ బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలను పూర్తిచేసిన చిత్రయూనిట్.. రెండోసారి వెళ్ళినపుడు ఇంకొంత భాగం పూర్తిచేసుకుంది. ఈ మేరకు ఇక తన పని పూర్తయిందని త్రిష పేర్కొంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథ, మాటలు అందించడం విశేషం. సి. సత్య ఈ సినిమాకు సంగీతం అందించారు.
మరోవైపు మలయాళంలో మోహన్లాల్ తో కలిసి 'రామ్' చిత్రంతో పాటు, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' (వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్ పైకి ఇటీవలే చేరిన త్రిష.. మెగాస్టార్తో కలిసి ఓ సాంగ్ షూట్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.