Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
త్రిషతో మూడోసారి చేస్తున్నాడు !
శింబు - త్రిష జంటగా గతంలో 'అలై', 'విన్నైతాండి వరువాయా' వచ్చాయి. వీటిలో 'విన్నైతాండి వరువాయా' సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కి వీరి జంటకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇది విడుదలై నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్య - అనుష్క జంటగా 'ఇరండాం ఉళగం' వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించి చేతులు కాల్చుకున్న సెల్వరాఘవన్ ప్రస్తుతం ఓ లోబడ్జెట్ చిత్రాన్ని రూపొందించటంపై దృష్టి సారించారు.
హీరోగా శింబును ఎంచుకున్న ఆయన... త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేశారు. గతంలో వీరి జంటకు చక్కని పేరు ఉండటంతో తన కొత్త చిత్రానికి అది కలిసొస్తుందనే ధీమాలో సెల్వరాఘవన్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తెలుగులో విషయానికి వస్తే... ఎమ్.ఎస్.రాజు స్వీయ దర్శకత్వంలో'రంభ ఊర్వశి మేనక' ('రమ్' )అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, నికీషా పటేల్, ఇషా చావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఫైనాన్సియల్ క్రైసిస్ లో ఇరుక్కుని ఆగిపోయింది. ఈ చిత్రం మేజర్ షెడ్యూల్స్ రెండు జరిగి మూడో షెడ్యూల్ వద్ద ఆగిపోయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013లోనే విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే అనుకోని విధంగా ఆర్దిక ఇబ్బందులు రావటంతో ఎమ్.ఎస్ రాజు చేతులెత్తేసారని చెప్పుకుంటున్నారు.