Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'మగధీర' లాంటి హిస్టారికల్ ప్రాజెక్టు చేస్తున్నా
చెన్నై:ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ .సి ..హర్రర్ సినిమాలకు, కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన త్వరలో ఓ హిస్టారికల్ చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నారు. ఆ చిత్రం భారీ బడ్జెట్ తో లావిష్ గా ఉంటుందని చెప్తున్నారు.
ఆ చిత్రం యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... సినిమా మగధీర తరహాలో ఉంటుందని, హిస్టారికల్ సబ్జెక్ట్ అని తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందనున్న చిత్రం అని చెప్తున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చిన ఓ హీరోయిన్ ఈ సినిమాలో నటించబోతుందని చెప్పారు.
హీరో ఎవరనేది ఓ వారంలో ఫైనలైజ్ అవుతుందని, విజువల్ ఎఫెక్ట్ లకు ఆర్ సి కమలాకరన్ ని ఎంచుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణమని చెప్తున్నారు. సినిమాలో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తో నిండి ఉంటుందని, సుందర్ సి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని భావించి, కమలాకరన్ ని రప్పించారని చెప్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే రెండు నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా రాజుల కథగా సాగుతుందని , వీరత్వం ప్రధానంగా ఉంటుందని చెప్తున్నారు. మరి సుందర్ సి ఈ సినిమాతో ఏ స్దాయిలో హిట్ కొడతారో చూడాలి. హిట్ అయితే ఇక్కడకు కూడా ఎలాగో డబ్ చేస్తారు కదా.