Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సీక్వెల్ లేనట్లే, అందుకే ఆత్రేయ కుర్చీ ని అలా చేసారు
చెన్నై: సూర్య హీరోగా విక్రమ్కుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'. విడుదలయ్యాక మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా సినిమా చూసినవారు మాత్రం అందులో సూర్య చేసిన ఆత్రేయ పాత్రను మాత్రం మర్చిపోలేదు. ఆత్రేయ పాత్ర ఎప్పుడూ ఓ చక్రాల కుర్చీలో కూర్చుని ఉంటుంది.
ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని, ఆత్రేయ టైటిల్ తోనే చిత్రం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తమిళంలో సినిమా అసలు వర్కవుట్ కాకపోవటంతో సూర్య ఆ ఆలోచన మానుకున్నారు. ఇప్పుడు ఇక ఆత్రేయ వాడిన ఆ కుర్చీతో ఉపయోగం లేదు.
దాంతో ఆత్రేయ పాత్ర ఉపయోగించిన ఖరీదైన చక్రాల కుర్చీని సూర్య చండీగఢ్లోని ది స్పైనల్ ఫౌండేషన్ అనే సంస్థకు విరాళంగా ఇచ్చారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ కుర్చీని న్యూ చండీగఢ్లో ఆ రాష్ట్ర గవర్నర్ జులై 10న ప్రారంభించనున్న రీహాబిలిటేషన్ సెంటర్లో వాడనున్నారు.
ఎక్కువగా పక్షవాత వ్యాధితో బాధపడుతున్న వారికి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించేందుకు ఫౌండేషన్ నిర్ణయించిందట. ఈ సందర్బంగా సూర్యకు స్పైనల్ ఫౌండేషన్ సోషల్ వెబ్సైట్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో కూడా సూర్య సహాయం ఇలాగే కొనసాగాలని ఫౌండేషన్ కోరింది.
ఇక ఈ చిత్రంలో సూర్య.. మణి, సేతురామన్, ఆత్రేయ అనే మూడు పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులతోపాటు విమర్శకుల మన్ననలు పొందారు. టాక్ ఎలా ఉన్నా ఓ మంచి చిత్రంలో చేసారన్న పేరైతే వచ్చింది.