twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడు, దర్శకుడు మణివన్నన్ మృతి

    By Bojja Kumar
    |

    Manivannan
    చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు మణివన్నన్ ఒక లేరు. 59 ఏళ్ల మణివన్నన్ శనివారం గుండెపోటుతో మరణించారు. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటుడిగా, 50కిపైగా చిత్రాలకు దర్శకుడిగా పని చేసిన మణివన్నన్ సీనియర్ తమిళ సినీ ప్రముఖుల్లో ఒకరు.

    మణివన్నన్ కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు. తెలుగు, మళయాలం, హిందీ సినిమాల్లో కూడా నటించారు. మణివన్నన్ దర్శకత్వంలో చివరగా సత్యరాజ్ ప్రధాన పాత్రలో 'నాగరాజ చోలన్ ఎంఏ, ఎంఎల్ఏ' అనే తమిళ చిత్రం విడుదలైంది. మే 10, 2013లో విడుదలైన ఈ చిత్రంలో ఆయన ఓ పాత్ర కూడా పోషించారు.

    తెలుగులో ఆయన ప్రేమలేఖ, శివాజీ, నరసింహ తదితర చిత్రాల్లో నటించారు. మణివన్నన్ మరణవార్తతో కోలీవుడ్ మొత్తం విషాదంలో మునిగి పోయింది. నటులు సిద్ధార్థ, ప్రియమణి, దర్శకుడు సుందర్ సి తదితరులు ట్విట్టర్లో తమ సంతాపం వ్యక్తం చేసారు. మణివన్నన్ మరణ వార్త ఇటు పలువురు తెలుగు సినీ ప్రముఖులను కూడా కలిచి వేసింది.

    English summary
    
 Tamil actor-director Manivannan passed away in Chennai following a cardiac arrest on Saturday. He was 59. With over 400 films as an actor and nearly 50 films as director, Manivannan was one of the most experienced personalities in Kollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X