Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెళ్లిపేరుతో మోసం ...సినీనటి పోలీస్ కంప్లైంట్
చెన్నై: ఆండిపట్టికి చెందిన ఇళయరాజా అనే వ్యక్తి తనను వివాహం చేసుకొని, కొంతకాలం తరువాత మోసగించాడని సినీ, బుల్లితెర నటి హేమలత ఫిర్యాదు చేసింది. గతంలో 'పుల్లుకట్టు ముత్తమ్మ' అనే తమిళ చిత్రంతో పాటు పలు టీవీ సీరియళ్లలో నటించిన హేమలత ప్రస్తుతం సినిమా నిర్మాణ సంస్థ నడుపుతోంది. ఆండిపట్టికి చెందిన రాజకీయవేత్త రాజ రెండో కుమారుడు ఇళయరాజ -హేమలతలకు కొంతకాలం క్రితం వివాహం జరిగింది.
అయితే, ప్రస్తుతం తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఇళయరాజ మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. ఈ మేరకు నిశ్చితార్థం కూడా జరిగింది. దీనిపై హేమలత తనకు న్యాయం చేయాల ని కోరుతూ తిరుమంగళం పోలీసులకు, నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసింది.
కాగా తెలుగు వ్యక్తి కావడం, స్థానికంగా పలుకుబడి లేకపోవడంతో తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని, మిత్రుల సలహా మేరకు తెలుగువారికి అండదండలు అందిస్తున్న ద్రవిడదేశం అధ్యక్షుడు కృష్ణారావుకు ఫిర్యాదు చేశానని హేమలత తెలిపింది. కాగా, పలువురు మహిళలు ఇలా నయవంచకుల చేత మోసగింపబడుతున్నారని, వీరు మౌనంగా ఉండిపోవడం కంటే న్యాయం కోసం పోరాడవలసి ఉందని కృష్ణారావు అన్నా రు. తెలుగువారైన హేమలతకు న్యాయం జరిగే వరకు ద్రవిడదేశం అన్ని విధాలుగా ఆండగా నిలుస్తుందని ప్రకటించారు.