Just In
- 4 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రామ్ చరణ్ వద్దనుకున్న టైటిల్ తో హీరో విజయ్
చెన్నై : ప్రస్తుతం కోలీవుడ్లో ట్రెండ్గా మారిన చిత్రం ఏదీ అంటే ... 'తెరి' . 'పులి' తర్వాత విజయ్ హీరోగా ఇందులో నటిస్తున్నారు. 'రాజారాణి' ఫేం అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు గానూ మెరుపు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మెరుపు టైటిల్ ని గతంలో రామ్ చరణ్, తమిళ దర్శకుడు ధరణి కాంబినేషన్ లో ప్రారంభమై ఆగిపోయిన చిత్రానిది కావటం విశేషం.

చిత్రం మరిన్ని విశేషాలకు వస్తే...నిజానికి ఈ సినిమాకు 'తెరి' టైటిల్ పెట్టనున్నట్లు ఆరంభమైన రోజుల్లోనే సోషల్ మీడియాలో పోస్ట్లు వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ మళ్లీ పోలీసు అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఫస్ట్లుక్ను దర్శకుడు అట్లీ విడుదల చేశారు. మూడు గెటప్లలో కనిపించే విజయ్ ఫొటోలు ఉన్నాయి.

గతంలో ఎప్పుడూ విజయ్ ఇలాంటి ఛాయల్లో కనిపించలేదని ఆయన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో త్రిపాత్రాభినయం పోషిస్తున్నారనేందుకు ఈ పోస్టరే సాక్ష్యమని కూడా ప్రచారం సాగుతోంది. విజయ్ సరసన సమంత, ఎమీ జాక్సన్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారు.