Just In
- 23 min ago
రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చేయ్.. కామెడీ హీరోకు నాని సలహా
- 1 hr ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 2 hrs ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 2 hrs ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
Don't Miss!
- News
టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ పథకాలు..: ఎమ్మెల్యే రాజయ్య సంచలనం
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిమాన గణంతో దళపతి సెల్ఫీ.. వారికి కౌంటర్గా బలాన్ని చూపెట్టేందుకేనా?.. వైరల్ పిక్
దళపతి విజయ్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట రజినీకి సరి సమానమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడీ హీరో. వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ పని పడుతున్న విజయ్.. చివరగా బిగిల్ (తెలుగులో విజిల్) అంటూ మోతమోగించాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300కోట్ల కొల్లగొట్టినట్టు నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ నిత్యం వార్తల్లో నిలుస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

ఐటీ రైడ్స్తో షాక్..
విజయ్పై ఐటీ రైడ్స్ అనే ఈ వార్త గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తూనే ఉంది. బిగిల్ మూవీ బాక్సాఫీస్ లెక్కల్లో అవకతవకలు, ఆయన రెమ్యూనరేషన్లోనూ తప్పుడు లెక్కలు ఉండటం, ఆదాయ పన్ను ఎగవేస్తున్నారనే కారణాలతో బిగిల్ చిత్రి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్స్, హీరో ఇలా అందరిపైనా ఐటీ రైడ్స్ చేశారు.

కక్షగట్టి చేస్తున్నారంటూ ఫైర్..
విజయ్పై కావాలనే ఐటీ రైడ్స్ చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి, ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నాడని కక్షగట్టి ఈ దాడులు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలా విజయ్ ఐటీ రైడ్స్ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకోవడంతో మరింత రచ్చగా మారింది.
|
షూటింగ్ లొకేషన్లపై దాడి..
విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాష్టర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సమీపంలోని నైవేలీ ప్రాంతంలో మాష్టర్ షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగానే.. ఐటీ రైడ్స్ చేశారు. అయితే కొందరు బీజేపీ కార్యకర్తలు వచ్చి షూటింగ్ లొకేషన్లలో గొడవ చేశారు.

అభిమాన గణంతో సెల్ఫీ..
అలా బీజేపీ కార్యకర్తలు మాష్టర్ షూటింగ్కు ఆటంకం కలిగిస్తున్నారని తెలుసుకున్న విజయ్ అభిమానులు తండోపతండాలుగా కదిలివచ్చారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ జరగ్గా.. పోలీసుల వచ్చి సర్ది చెప్పారు. ఇలా ఆ ఉదంతం ముగిసిపోయింది. అయితే తాజాగా విజయ్ షేర్ చేసిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తన అభిమాన గణంతో దిగిన ఆ సెల్ఫీతో.. తనపై కుట్రపూరితమైన చర్యలు చేస్తున్న వారికి తన బలమేంటో అందరికీ చూపెడుతున్నాడా? అని కామెంట్స్ విసురుతున్నారు. ప్రస్తుతం నైవేలీ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ రోల్ను పోషిస్తున్న సంగతి తెలిసిందే.