Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
టిక్కెట్ రేటు పెంచవద్దన్నారని, సినిమా ఆపేసారు
చెన్నై: తమిళ స్టార్ విజయ్ కు సమస్యలు ఇప్పుడిప్పుడే తీరేటట్లు లేవు. ఆయన సినిమా రిలీజ్ అంటే ఎక్కడ లేని సమస్యలు ఆయన వెనక పడుతున్నాయి. తాజాగా ఆయన థేరీ చిత్రంతో ముందుకు వస్తున్నారు. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచి చిత్రమైన సమస్యలు వెంటాడుతున్నాయి.
గత రెండు రోజులుగా.. ఆ సమస్యలు మరీ సంక్లిష్యంగా మారిపోయాయి. తమిళనాడు గవర్నమెంట్... అన్ని ధియోటర్ ఓనర్స్ ని టిక్కెట్ రేటు నామినల్ రేట్లుకే అమ్మాలని, పెంచి అమ్మితే ఊరుకునేది లేదని ఓ రేంజిలో వార్నింగ్ ఇచ్చింది. రేటు పెంచితే జైలు తప్పదన్నట్లు ఆ వార్నింగ్ సారాంశం ఉంది.
అయితే ధియేటర్ ఓవర్లు కంప్లైంట్ ఏమిటీ అంటే... ధేరీ నిర్మాత ..భారీ రేట్లకు ఆ సినిమాకు తమకు అమ్మాడని, తాము తమ పెట్టుబడి వెనక్కి రప్పించుకోవాలంటే మినిమం ఐదు వందలకు తక్కువ అమ్మటానికి లేదని , అంతగా అయితే రిలీజ్ చేయకుండా ఉండటం బెస్ట్ అని అంటున్నారు.
ముఖ్యంగా కోయంబత్తూరు, చెన్నై, మధురే వంటి ఏరియాల్లో ఈ విషయాన్ని ధియేటర్స్ బయిట నోటీసుగా ఉంచారు. తాము ఈ సినిమాని ప్రదర్శించటం లేదని ధియేటర్ వాళ్లు పోస్టర్లు వేసారు. ఈ విషయమై నిర్మాత ధానుతో మాట్లాడదామంటే మీడియాకు ఆయన దొరకటం లేదు.