అనసూయతో డేట్ కు వచ్చిన రామ్ చరణ్, భలే సరదాగా ఉందే (వీడియో)
అనసూయ నిర్వహిస్తున్న సక్సెస్ ఫుల్ టీవీ షో 'ఏ డేట్ విత్ అనసూయ' సెకండ్ సీజన్ మొదలైంది. ఈ సీజన్ కు రామ్ చరణ్ ని తీసుకువచ్చారు.
హైదరాబాద్ : హాట్ యాంకర్ అనసూయ కొత్త టీవి షో చేస్తోంది. ఇక ఆ ప్రోగ్రామ్ పేరు 'ఏ డేట్ విత్ అనసూయ'. టీవీ 9 ఛానెల్లో ప్రసారమయ్యే ఈ షోలో సెలబ్రిటీలను తీసుకువచ్చి 'కాఫీ విత్ కరణ్' తరహాలో కొన్ని ఎపిసోడ్లు చేసి సక్సెస్ చేసింది.
ఈ షోలో సెలబ్రీలు సరదాగా కబుర్లు చెబుతున్నారు. పైకి చిట్ చాట్ ప్రోగ్రాంలాగే అనిపిస్తున్నప్పటికీ సమ్ థింగ్ స్పెషల్ లా ఉంటుందీ ప్రోగ్రామ్. అయితే హీరో హీరోయిన్స్ తో ముచ్చట్లు చెబుతూ సినిమాలను ప్రమోట్ చేయడం ఈ ప్రోగ్రాం ఒక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇటివలే ఈ ప్రోగ్రాం కు బ్రేక్ పడింది. దీంతో అది ఆగిపొయిందని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు సెకెండ్ సీజన్ మొదలైయింది. ఈ సీజన్ మెగా హీరో రామ్ చరణ్ తో మొదలెట్టింది అనసూయ.
రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం ధృవ. డిసెంబర్ 9న విడుదల కానున్న ఈ చిత్రం కోసం.. ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేశారు. అందులో భాగంగా ఇప్పుడు అనసూయ 'డేటింగ్' లో కూడా పాల్గోన్నాడు చరణ్. సినిమాకి సంబధించిన బోలెడు కబుర్లు ఇందులో చెప్పుకున్నారు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేసారు. ప్రోమో చాలా ఆసక్తికంగా ఉంది చూడండి.
ప్రస్తుతం అనసూయ... సాయిధరమ్ హీరోగా చేస్తున్న 'విన్నర్'లో ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. ఆ పాట షూటింగ్ ఉక్రెయిన్లో జరుగింది. అక్కడ నుంచి రాగానే ఈ పోగ్రామ్ సెకండ్ సీజన్ పై ఆమె దృష్టి పెట్టింది.
వరుస సినిమా అవకాశాలు వస్తున్నా టీవీ షోస్ను మాత్రం వదలనని చెప్తోందట ఈ అమ్మడు. 'ఏ డేట్ విత్ అనసూయ' షో లో స్టార్స్ చెప్పే కబుర్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై చేస్తున్న అనసూయ కెరీర్ బాగానే ఉంది. బెస్టాఫ్ లక్ అనుసూయ.


Click it and Unblock the Notifications











