Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మహేష్ చెప్పిందే నిజమవుతుందా? అసలు బిగ్ బాస్ హౌస్లో అతని కథేంటి..?
బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎలా ఉంటారు? ఎప్పుడెలా ప్రవర్తిస్తారు? కంటెస్టెంట్ల గేమ్ స్ట్రాటజీ ఏంటి అనేది ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం ఈ మూడో సీజన్లో.. మహేష్ కూడా అలానే ఉంటున్నాడు. అయితే మొదట్లో చాలా ఆవేశంగా ఉన్న మహేష్.. రానురాను కాస్త చల్లబడ్డాడు. అయితే గేమ్ ఆడే విధానాన్ని కూడా మార్చుకున్నాడు.
పునర్నవి ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాలా: రాహుల్.. ప్రేమగా మార్చుకుంటాడేమోనన్న వరుణ్
బాబా బంటుగా..
బాబా భాస్కర్ వెంటే ఉండటం, ఆయనతోనే మాట్లాడటం.. మిగతా ఎవ్వరితోనూ కలవకపోవడం లాంటివి చేయడం, ఇద్దరూ కలిసే రాత్రంతా ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకోవడం.. ఇలా ఎక్కడ చూసినా వీరిద్దరే కనబడటంతో బాబా బంటు అని మహేష్కు ట్యాగ్ వచ్చేసింది. ఇక దీని నుంచి బయటపడాలని మహేష్ ప్రయత్నం చేశాడు..
వరుణ్ బ్యాచ్ కు దగ్గరైన మహేష్..
బాబా బంటు అనే ట్యాగ్ పోవాలంటే అందరితో కలిసుండాలని నిశ్చయించుకున్న మహేష్ వరుణ్, రాహుల్, వితికా, పునర్నవిలతో బాగానే కలిసిపోయాడు. ఇక వీరితో క్లోజ్ గా ఉండేసరికి బాబాకు కాస్త దూరమయ్యాడు. వీరిద్దరి మధ్యలో కాస్త గ్యాప్ పెరిగింది. అయితే దీనంతటికి కారణం శ్రీముఖే అని మహేష్ అభిప్రాయం. మళ్లీ బాబాతో మాట్లాడి మామూలు స్థితికి వచ్చేశాడు.
Recommended Video
గతవారంలో మహేష్ చెప్పినట్టుగా ఎలిమినేషన్
వరుణ్, రాహుల్, పునర్నవి, మహేష్ ఎలిమినేషన్లో ఉండగా.. ఆ ముగ్గురిలోంచే ఒకరు పోతారని మహేష్ తెలిపాడు. లేదంటే తానే ఎలిమినేట్ కావొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే ఇప్పటి వరకు ఆ నలుగురు కలిసే ఉన్నారు.. వారిలోంచి ఎవరూ ఎలిమినేట్ కాలేదు.. వారికి ఆ బాధ ఎలా ఉంటుంది తెలియదు కదా? అందుకే ఈ సారి ఒకరు ఎలిమినేట్ కావాలి.. ఆ బాధ వారు కూడా పడాలంటూ చెప్పుకొచ్చాడు. నిజంగానే మహేష్ చెప్పినట్లు.. పున్ను ఎలిమినేట్ అయింది.
రెండు గ్రూపుల మధ్య వారధి..
శ్రీముఖి గ్రూప్లో బాబా, అలీ, శివజ్యోతి ఉన్నట్లు నిన్నటి ఎపిసోడ్లో క్లియర్ కట్ గా తెలిసిపోయింది. వరుణ్, రాహుల్, వితికా, మహేష్ లు ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా.. శ్రీముఖి, అలీ, శివజ్యోతి, బాబాలు మరోచోట కూర్చుని మాట్లాడుతున్నారు. ఇక శ్రీముఖి మాట్లాడుతూ.. మహేష్ తనకు అందుకే నచ్చడంటూ.. తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. నామినేట్ అయ్యాడు కాబట్టే.. ఆ గ్రూప్లో చేరాడు అంటూ మహేష్ గురించి చెప్పుకొచ్చింది.
పుల్లలు పెడుతున్నాడని అనుకోవద్దు ప్రేక్షకులు..
వరుణ్ వాళ్లతో మాట్లాడటం అయ్యాక శ్రీముఖి వాళ్ల దగ్గరకు వచ్చాడు. మీ మీటింగ్స్ అయిపోయాయా అంటూ శ్రీముఖి సెటైరికల్ గా అంది. మాష్టర్ గురించే మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చాడు. అతను కావాలని చేసినా, స్ట్రాటజీ అయినా మనకు చెబుతాడా? అయినా ఎవరికి ఎవరు చేసినా మనం బాగా ఆడటం లేదు కాబట్టి నామినేషన్లోకి వచ్చాము.. పోయిన వారం కూడా మనమే కదా నామినేషన్లోకి వచ్చామని చెప్పినట్లు తెలిపాడు.
ఆ ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటూ. మనమే ఐదుగురం ఫైనల్కు వెళ్దామని మహేష్ అనగా.. మనది మనమే రీజన్స్ చెపుకుందామని శ్రీముఖి అంటూ.. నేను శివజ్యోతి పేరు చెబుతాను అది నాకు విలన్.. కిచెన్లో ఎప్పుడూ సహాయం చేయలేదంటూ.. చెప్పుకొచ్చింది. అయితే చివర్లో నామినేషన్స్ ఉండవంటూ అలీ పంచ్ వేశాడు. అలీ శివజ్యోతి నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుంటూ.. వరుణ్, రాహుల్, వితికా అవుతారని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అతి తెలివిని ప్రదర్శిస్తూ.. వీ, ఆర్ అంటూ బెడ్పై రాస్తూ.. అలీతో మాట్లాడుకొచ్చింది. అయితే ఆర్, వీ అంటూ అలీబయటకు మాట్లాడేసి.. ఇదేమన్నా పెద్ద సీక్రెటా? అని అన్నాడు. అయితే వారు మాట్లాడుకున్నట్లే.. రాహుల్, వరుణ్ నామినేషన్లోకి వచ్చారు. మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.