Bigg Boss Elimination: ఒక్క ఎపిసోడ్కే మారిన ఓటింగ్.. అతడికి ప్లస్.. డేంజర్ జోన్లోకి ఊహించని లేడీ
ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్పందనను సొంతం చేసుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు గ్యాప్ లేకుండా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ను ప్రసారం చేస్తున్నారు. ఇది ఫినాలే స్టేజ్కు చేరడంతో మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి ఎలిమినేషన్స్ను నిర్ణయించే 14వ వారానికి సంబంధించిన ఓటింగ్లో ఎలా జరుగుతుంది? ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు? చూసేద్దాం పదండి!

ఫినాలే ముందు ఆసక్తికరంగా
అంచనాలు లేకుండానే వచ్చి సంచలనాలు సృష్టించిన షో బిగ్ బాస్. దీని నుంచి వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆరో దానిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. కానీ, ఆరంభంలో దీనికి పెద్దగా రెస్పాన్స్ మాత్రం రాలేదు. కానీ, ఇప్పుడు ఇది చివరి దశకు చేరుకోవడంతో స్పందన పెరుగుతోంది. ఫలితంగా రేటింగ్ కూడా క్రమంగా పుంజుకుంటూనే ఉంది.

ఎలిమినేట్ అయింది ఎవరు
బిగ్ బాస్ ఆరో సీజన్లోకి 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, మొదటి వారం ఎలిమినేషన్ తీసేసినా.. రెండు, పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇలా ఇప్పటికి 13 వారాలకు 14 మంది వెళ్లారు. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనా, రాజ్, ఫైమాలు ఎలిమినేట్ అయ్యారు.

ఆ ఒక్కడు తప్ప వాళ్లందరూ
బిగ్ బాస్ ఆరో సీజన్ ఫినాలేకు మరో వారం మాత్రమే మిగిలి ఉంది. దీంతో చివరి ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్లో అందరూ నామినేట్ అయ్యారు. అయితే, టికెట్ టు ఫినాలే టాస్కు గెలిచి మొదటి ఫైనలిస్ట్ అయిన శ్రీహాన్ తప్ప హౌస్లో ఉన్న వాళ్లందరూ అంటే రేవంత్, ఆది రెడ్డి, కీర్తి భట్, ఇనాయా సుల్తానా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు.

ఎపిసోడ్ను బట్టి మార్పులు
బిగ్ బాస్ ఆరో సీజన్లో ఇప్పుడు ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అందులో ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇందులో నలుగురు మాత్రమే టాప్ 5కి చేరుతారు. అంటే ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను ఫినాలేకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎపిసోడ్కు ఒకలా ఓటింగ్ మారుతోంది.

టాప్లో మాత్రం అతడేనట
ఈ సీజన్లోకి మొత్తం 21 మంది సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. అందులో రేవంత్ మాత్రమే ఆరంభం నుంచే తనదైన ఆటతీరుతో టైటిల్ ఫేవరెట్గా నిలుస్తున్నాడు. దీంతో అతడు ఎప్పుడు నామినేషన్స్లో ఉన్నా అత్యధిక ఓటింగ్తో సేఫ్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే పద్నాలుగో వారం కూడా అతడే ముందంజలో ఉన్నాడు. దీంతో ఈ వారం కూడా అతడు సేఫ్ అయినట్లే లెక్క.

మిగిలిన స్థానాలో వాళ్లంతా
బిగ్ బాస్ ఆరో సీజన్ పద్నాలుగో వారానికి జరుగుతున్న ఓటింగ్లో ప్రస్తుతానికి సింగర్ రేవంత్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోన్నాడు. అతడి తర్వాత అంటే రెండో స్థానంలో రోహిత్ సాహ్నీ ఉన్నాడని తెలిసింది. అలాగే, లేడీ ఫైర్ బ్రాండ్ ఇనాయా సుల్తానా మూడో స్థానంలో నిలిచినట్లు సమాచారం. అలాగే, మరో లేడీ శ్రీ సత్య నాలుగో స్థానంలో ఉందని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఆది రెడ్డి పైకి.. కీర్తి కిందకు
పద్నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్లో ప్రస్తుతం ఆది రెడ్డి ఐదో స్థానంలో ఉండగా, కీర్తి భట్ ఆరో స్థానానికి పడిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిన్నటి వరకూ ఆది రెడ్డే చివర్లో ఉన్నాడు. కానీ, గత ఎపిసోడ్లో అతడి నుంచి వచ్చిన ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా వర్కౌట్ అయింది. దీంతో అతడి గ్రాఫ్ పెరిగింది. అయినప్పటికీ కీర్తి, ఆది డేంజర్ జోన్లోనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











