Bigg Boss Telugu 6: అబ్బాయిల ప్యాంటులో చేయి.. తెగించిన గీతూ రాయల్.. ఎప్పుడూ వినని బూతులతో!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని.. అత్యధిక రేటింగ్ను సొంతం చేసుకుంటూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఈ ఉత్సాహంతో నిర్వహకులు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసేశారు. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ఆరో దాన్ని కూడా మొదలెట్టారు. ఇందులో యమ రచ్చ చేస్తూ తెగ హైలైట్ అవుతోన్న వారిలో గీతూ రాయల్ ఒకరు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆసలేం జరిగిందో మీరే చూసేయండి!

ఏదో అనుకుంటే ఇంకేదోలా
భారతదేశంలో ఎన్నో భాషల్లో బిగ్ బాస్ షో ప్రారంభం అవుతున్నా.. తెలుగులో మాత్రమే అత్యధిక రేటింగ్ను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఆరో సీజన్ను నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సరికొత్తగా నడుపుతున్నారు. కానీ, దీనికి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఫలితంగా దీనికి చాలా తక్కువగానే రేటింగ్ దక్కుతోంది.

21మంది ఎంట్రీలో డేరింగ్
బిగ్ బాస్ ఆరో సీజన్లో కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఇలా మొత్తంగా ఈ సీజన్లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపారు. అందులో రాయలసీమ భామ గీతూ రాయల్ ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అవుతూ అందరి దృష్టిలో పడింది.

ఆట... మాటలోనూ హైలైట్
అటు బుల్లితెరపై, ఇటు సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా తెగ సందడి చేస్తున్న.. గీతూ రాయల్ చాలా మందికి సుపరిచితురాలు అయింది. దీంతో ఆమెకు కొంత మేర క్రేజ్ కూడా దక్కింది. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తనదైన ఆటతీరుతో అందరి మనసులు దోచుకుంటోంది. అదే సమయంలో మాట పరంగానూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

చేపల చెరువు అనే టాస్కు
బిగ్ బాస్ ఆరో సీజన్లో ఎనిమిదో వారానికి సంబంధించిన కెప్టెన్ కోసం పోటీదారులను ఎంపిక చేసేందుకు 'చేపల చెరువు' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లను ఏడు జంటలుగా విభజించి కొన్ని రౌండ్లను నిర్వహిస్తారు. ఇది ముగిసే సమయానికి ఏ జంటల దగ్గరైతే ఎక్కువ చేపలు ఉంటాయో.. వాళ్లు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు.

అతడితో కలిసి గీతూ రచ్చ
ఎనిమిదో వారానికి జరిగిన 'చేపల చెరువు' టాస్కులో గీతూ రాయల్, ఆది రెడ్డి ఒక టీమ్గా ఆడారు. ఆరంభంలోనే వీళ్లిద్దరూ తమ తమ బుర్రలకు పని చెప్పారు. ఆ సమయంలోనే స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్లను టార్గెట్ చేసి రెచ్చగొట్టాలని డిసైడ్ అయ్యారు. అలాగే, వీక్గా ఉన్న వాళ్ల నుంచి చేపలను లాక్కోవాలని అనుకున్నారు. ఇలా మంచి ప్లాన్తోనే టాస్కులోకి ప్రవేశించారు.

ఆ మాట అనగానే కోపంగా
'చేపల చెరువు' టాస్కు మొదలు కాగానే గీతూ రాయల్ తన దూకుడైన ఆటను మొదలు పెట్టేసింది. ఈ క్రమంలోనే కొంత మందితో కావాలని గొడవలు పెట్టుకుంది. అలాగే, చేపలు లాక్కోడానికి కూడా ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో ఒకరు 'ఆడవాళ్ల దగ్గర చేపలు లాక్కోకండి' అంటూ జెండర్ ఫీలింగ్ తీసుకొచ్చారు. దీంతో గీతూకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది.

మగాళ్ల ప్యాంట్లలో చేయి
జెండర్ టాపిక్ తీసుకు రాగానే గీతూ ఓ రేంజ్లో రెచ్చిపోయింది. 'ఒక్కో టాస్కును ఒక్కోలా ఆడతారెందుకు? మొన్న ఎవరైనా ఒక్కటే అన్నారు. ఇప్పుడిలా అంటున్నారు. నేనైతే మగాళ్ల ప్యాంటులో అయినా చేయి పెడతా. లోపల దాచుకున్నా తీసుకుంటా. బొచ్చులో ఆటలు' అంటూ తెగిస్తూ మాట్లాడింది. అలాగే కొన్ని బూతులను కూడా మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చేసింది.


Click it and Unblock the Notifications











