Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెలుగు న్యూస్ ఛానెల్ లో టీవీ సీరియల్
బుల్లి తెర హీరో ఇంద్రనీల్ నటిస్తున్న 'సి.ఐ.డి విశ్వనాథ్' టీవీ సీరియల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. జైనీత్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రవణ్కుమార్ వీర్లపాటి దర్శకత్వంలో విసు తన్నీరు నిర్మిస్తున్నారు. నిర్మాత విసు తన్నీరు మాట్లాడుతూ ' శ్రీవారు, ఎవరు అనే రెండు సీరియల్స్ను నిర్మించిన మా సంస్థ నుంచి వస్తున్న మూడో ప్రయత్నమిది. దర్శకుడు శ్రవణ్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ సీరియల్ను నిర్మిస్తున్నాం.
విసు 24 ఫ్రేమ్స్ సమర్పణలో జైనీత్ ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు, నిర్మాత విసు తన్నీరు నిర్మిస్తున్న ధారావాహిక 'సి.ఐ.డి. విశ్వనాథ్'. ఈ నెల 11 నుంచి టి.వి 5లో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'భారీ బడ్జెట్తో రూపొందిన ఈ అడ్వెంచరస్ ధారావాహిక ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈ ధారావాహిక ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. ఇంద్రనీల్ ప్రధాన పాత్ర పోషించారు' అని తెలిపారు. విసు తన్నీరు. ముఖేష్, తిలక్, మహేశ్వరి, గిరీష్, మక్కెన, నామాల రవీంవూదసూరి, దివ్య, శ్రవణ్ తదితరులు నటిస్తున్నారు.
ఎంటర్టైన్మెంట్ చానల్స్లో సీరియల్స్ ప్రసారమవ్వడం మనకు తెలిసిందే. కానీ న్యూస్ చానల్లో సీరియల్ ప్రసారమైతే..? అవును తెలుగులో న్యూస్చానల్గా అందరికీ సుపరిచితమైన టీవీ5 ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నటుడు, నిర్మాత అయిన విసు తన్నీరు ఈ కొత్త ఒరవడికి తెరలేపాడు. 'సి.ఐ.డి. విశ్వనాథ్' పేరుతో నిర్మించిన ఈ సీరియల్ ప్రతి ఆదివారం ప్రసారమవుతోంది. న్యూస్చానల్లో ప్రసారమవుతున్న తొలి సీరియల్ కూడా ఇదే కావడం విశేషం. పూర్తి అడ్వెంచర్తో రూపొందిన ఈ సీరియల్ను భారీ బడ్జెట్తో నిర్మించినట్లు చెపుతున్నారు. ఇంద్రనీల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సీరియల్ అద్యంతం సస్పెన్స్తో అందరినీ ఆకట్టుకుంటుందట. వీరి ప్రయోగం సక్సెస్ అయితే మిగతా న్యూస్చానల్స్ కూడా ఇదే దారిలో నడుస్తాయో లేదో వేచిచూద్దాం.
నిర్మాత విసు తన్నీరు మాట్లాడుతూ భారీ బడ్జెట్తో రూపొందించిన అడ్వెంచరస్ సీరియల్ ఇదేనని, న్యూస్ ఛానెల్స్లో ప్రసారమవుతున్న తొలి సీరియల్ కూడా ఇదే కావడం విశేషమని తెలిపారు. సాధారణంగా అందరూ ఎంటర్టైన్మెంట్కోసం సీరియల్స్ తీస్తుంటే వాటికి భిన్నంగా తాము న్యూస్ ఛానెల్స్కోసం ఈ సీరియల్ నిర్మించామని, ప్రతి ఒక్కరినీ ఈ సీరియల్ ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఇప్పుడు వస్తున్న సీరియల్స్కి భిన్నంగా ఆద్యంతం సస్పెన్స్తో ప్రేక్షకులకు మంచి ఫీల్ను అందిస్తుందని దర్శకుడు శ్రవణ్కుమార్ వీర్లపాటి తెలిపారు. ఇంద్రనీల్, ముఖేష్, తిలక్, మహేశ్వరి, గిరీష్, మక్కెన, నామాల రవీంద్రసూరి, దివ్య, శ్రవణ్, ప్రవీణ్ నటిస్తున్న ఈ సీరియల్కు కథ: నామాల రవీంద్రసూరి, మాటలు: శివానంద్, కెమెరా: మురళీ, ఎపిసోడ్ డైరెక్టర్: శివానంద్, కోడైరెక్టర్: మహేష్, నిర్మాత: విసు తన్నీర్, దర్శకత్వం: శ్రవణ్కుమార్ వీర్లపాటి.