Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
గర్భవతిని చేసాడంటూ దర్శకుడిపై శ్రీజ ఫిర్యాదు
సినిమాల్లో హీరోయిన్ అవకాశం ఇస్తానని నమ్మించిన దర్శకుడు చాంద్ పాషా మోసం చేసాడని, తనను లైంగికంగా వాడుకుని గర్భవతిని చేసాడని శ్రీజ అనే టీవీ నటి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తనను మోసం చేస్తూ వస్తున్నాడని, ఈక్రమంలోనే గర్భవతిని చేసాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. లవ్ ఈజ్ గేమ్ అనే చిత్రంలో తనను హీరోయిన్ను చేస్తానని చంద్ పాషా నమ్మించాడని ఆమె తెలిపారు.
కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ అయితే బాగుండదని చెప్పపి నిర్మాతగా చేయమన్నాడని, తనతో 5 లక్షలు ఖర్చు పెట్టించాడని శ్రీజ మీడియాకు వెల్లడించింది. ఇలాంటి మోసగాడి వలలో మరెవరూ పడొద్దని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని శ్రీజ తెలిపారు.
గర్భం తొలగించుకోవాలని ఆమెపై ఒత్తిడి తెస్తుండటంతో పాటు, బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిని శ్రీజ...నటీనటులు కావాలంటూ పేపర్లో చాంద్ పాషా ఇచ్చిన పత్రిక ప్రకటన చూసి హైదరాబాద్ ఉప్పల్లోని అతని కార్యాలయానికి చేరుకుని అతని వలలో చిక్కుకుంది.
శ్రీజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చాంద్ పాషాపై కేసు నమోదు చేసారు. విచారణ అనంతరం చాంద్ పాషాను అరెస్టు చేసే అవకాశం ఉంది. చాంద్ పాషాకు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీజను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి ఆమెను లైంగికంగా లోబరుచుకున్నాడని స్పష్టమవుతోంది.