Just In
- 11 min ago
ఆ విషయంలో ప్రభాస్ సంచలన నిర్ణయం: భయపెడుతోన్న ఫ్లాప్ సెంటిమెంట్.. రిస్క్ చేస్తున్నాడు!
- 16 min ago
ఉదయం పెళ్లి, రాత్రి మంది పార్టీ చేసుకొని ప్రమాదానికి గురైన హీరో.. గుట్టుచప్పుడు కాకుండా
- 44 min ago
అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్: అఖిల్కు ముద్దుల మీద ముద్దులు.. ఊహించని ఘటనకు షాక్
- 2 hrs ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
Don't Miss!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- News
నీ వెనుక మేం ఉన్నాం: ఆ విషయంలో జాగ్రత్త: అఖిల ప్రియకు చంద్రబాబు ఫోన్: ఫస్ట్టైమ్
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి అడ్డంగా దొరికిపోయిన సోహెల్, మెహబూబ్: ఆధారాలు బయటకు రావడంతో బుక్కైపోయారు
బిగ్ బాస్ నాలుగో సీజన్ గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో పూర్తయింది. ఇందులో అభిజీత్ ప్రేక్షకుల ఆదరణతో విజేతగా నిలిచాడు. అలాగే, యాంగ్రీ యంగ్ మ్యాన్ అఖిల్ సార్థక్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. అంతకు ముందు మెహబూబ్, సయ్యద్ సోహెల్ రియాన్ మోసం చేశారంటూ ఓ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ ఇవ్వబోయారీ ఇద్దరు. ఈ క్రమంలోనే ఓ విషయాన్ని గురించి మాట్లాడుతూ మళ్లీ అడ్డంగా దొరికిపోయారు. దీంతో వీళ్లు చీట్ చేసింది నిజమేనన్న టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు మీకోసం!

రూ. 25 లక్షలు తీసుకున్న సోహెల్
గ్రాండ్ ఫినాలేలో ముందుగా టాప్ -5 నుంచి ఇద్దరు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ హౌస్లో అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ మిగిలారు. వీళ్లకు బిగ్ బాస్ రూ. 20 లక్షలు ఆఫర్ ఇచ్చాడు. దీనికి ఎవరూ ఒప్పుకోకపోవడంతో మరో ఐదు పెంచి రూ. 25 లక్షలు చేశారు. నాగార్జున ప్రకటించిన ఈ ఆఫర్కు సోహెల్ టెంప్ట్ అయి బయటకు వచ్చేశాడు.

బయటకు వచ్చిన చీటింగ్ వీడియో
రీయూనియన్ పార్టీ కోసం మెహబూబ్ హౌస్లోకి వెళ్లాడు. లోపల అందరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సోహెల్ దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకో అని సైగలు చేశాడతను. అప్పుడే మూడు వేళ్లు కూడా చూపించాడు. అంటే మూడో స్థానంలో ఉన్నావు.. ఆఫర్కు ఒప్పుకో అన్నాడని ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో సోహెల్, మెహబూబ్ మోసం చేశారని ప్రచారం జరుగుతోంది.

అభిజీత్ మనీ కట్.. ఫ్యాన్స్ ఆగ్రహం
గ్రాండ్ ఫినాలే రోజు బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ప్రకారం రూ. 25 లక్షలు తీసుకున్నాడు సయ్యద్ సోహెల్ రియాన్. దీంతో విన్నర్ అయిన అభిజీత్ ప్రైజ్ మనీ నుంచి రూ. 25 లక్షలు కట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సోహెల్ మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని అభిజీత్ ఫ్యాన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. మెహబూబ్తో పాటు అతడినీ చీటర్ చీటర్ అంటూ గేలి చేస్తున్నారు.

సోహెల్, మెహబూబ్ లైవ్లో క్లారిటీ
అభిజీత్ ఈ వీడియో గురించి హుందాగా స్పందించి స్టార్ మా వాళ్లకే వదిలేశాడు. అయితే, అతడి ఫ్యాన్స్ మాత్రం ఈ వ్యవహారంపై అస్సలు తగ్గడం లేదు. దీంతో సోహెల్ మీడియా వేదికగా ఈ గొడవలను ఆపమని అభిజీత్కు రిక్వెస్ట్ చేశాడు. అయినప్పటికీ ఆ కామెంట్లు ఆగకపోవడంతో తాజాగా సోహెల్, మెహబూబ్ సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించి క్లారిటీ ఇవ్వబోయారు.

మరోసారి అడ్డంగా దొరికిపోయారుగా
సోహెల్ మాట్లాడుతూ.. ‘వాడు చెప్పింది డబ్బుల కోసం కాదు. అదే నిజమైతే రూ. 10 లక్షలో లేకపోతే రూ. 20 లక్షలో తీసుకునే వాడిని కదా' అని అన్నాడు. ఆ వెంటనే మెహబూబ్ స్పందిస్తూ.. ‘ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల గురించే ఆ సైగలు చేశాను. సోహెల్ గాడికి 300K అయ్యారని చూపించాను. అంతే తప్ప వాళ్లు ఏ పొజిషన్లో ఉన్నారో నాకేం తెలుసు' అంటూ మళ్లీ బుక్కయ్యారు.

ఆధారాలు బయటకు రావడంతో బుక్
మెహబూబ్ చెప్పింది నిజమే అనుకుంటే.. ఇప్పుడు సోహెల్ ఇన్స్టా ఫాలోవర్లు 487K ఉన్నారు. కాబట్టి ఇది పచ్చి అబద్ధం అని అభిజీత్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇది మాత్రమే కాదు.. తాజాగా జరిగిన లైవ్ చాట్లో సోహెల్ చెప్పేదానికి, మెహబూబ్ వివరించే దానికి అస్సలు పొంతన లేదు. దీంతో వీళ్లిద్దరూ చీట్ చేసింది నిజమేనేమో అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి.