Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'అత్తో అత్తమ కూతురో' నిర్మాతపై కోర్టుకు...
హైదరాబాద్: నిరోష, జాకి, మహర్షి ప్రధాన పాత్రల్లో జెమినీటీవీలో ప్రసారం అవుతున్న ‘అత్తో అత్తమ్మ కూతురో' సీరియల్ పై వివాదం నెలకొంది. ఈ సీరియల్ నిర్మాతలపై కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు తెలుగు సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఈ టీవీ సీరియల్ లో ఇంకా రిలీజ్ కాని ‘తులసీదళం' సినిమా ట్రాక్ లను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆర్పీ పట్నాయక్ ఆరోపించారు.
ఆర్పీ పట్నాయక్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ‘తులసీదళం' సినిమా విషయానికొస్తే...అమెరికాలోని లాస్ వేగాస్ నేపథ్యంలో ఈ సినిమాలో నిశ్చల్ దేవా, వర్థనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ‘తులసీదళం సినిమా హారర్ తరహా చిత్రమే అయినా అందమైన ప్రేమకథ కూడా ఇందులో ఉంటుందని' దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రంలో ఆత్మలకు సంబంధించిన విషయాలపై పట్టు ఉన్న వైద్యుడిగా నటించినట్లు ఆర్పీ పట్నాయక్ తెలిపారు. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ ‘తులసీదళం'కు తమ చిత్రానికి సంబంధం లేదని ఆర్పీ తెలిపారు. ఆర్పీ పట్నాయక్ ఇప్పటికే ‘బ్రోకర్', ‘ఫ్రెండ్స్ బుక్' చిత్రాలను తెరకెక్కించినా అవి ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.