పుష్కర స్నానికి వెళుతుండగా ప్రమాదం: టీవీ హీరోయిన్ కు తీవ్ర గాయాలు(ఫోటోస్)
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు మొదలయ్యాయి. అందరి దారి ఇపుడు కృష్ణా నది వైపే సాగుతోంది. ఇదే క్రమంలో పుణ్య స్నానం కోసం విజయవాడ వెలుతుండగా టీ.వీ హీరోయిన్ రోహిణి రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలలో ఆమకు తీవ్రగాయలు అయ్యాయి.
కృష్ణాజిల్లా ఇబ్రహింపట్నం సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. పుష్కరస్నానం చేయడానికి హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో కారు నుజ్జు న్జు జరిగింది. ప్రమాదంలో రోహిని రెడ్డి కాలుకు తీవ్రమైన గాయాలైనట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు కారు డ్రైవర్ఉషప్పగౌడ్, అసిస్టెంట్ చంటి కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని విజయవాడ గొల్లపూడిలోని ఆంద్రా ఆసుపత్రికి తరలించారు.
గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్లైడ్ రోహిణి రెడ్డి ప్రమాదానికి సంబంధించిన ఫోటోస్, వివరాలు...

తీవ్రంగా గాయపడ్డ రోహిణి రెడ్డి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రోహిణి రెడ్డి ఆసుపత్రిలో....

కారు
ప్రమాదానికి గురైన కారు ఇదే. ప్రమాదం దాటికి నుజ్జు నుజ్జు అయింది.

కొంతకాలం దూరం
ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఆమె కొంత కాలం పాటు నటనకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి

శ్రీనివాస కళ్యాణం
రోహిణి రెడ్డి తెలుగులో వచ్చిన శ్రీనివాస కళ్యాణ్ తదితర సీరియల్స్ లో నటించారు.


Click it and Unblock the Notifications











