Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘ఆచార్య’ రిలీజ్ డేట్పై క్లారిటీ: ఈ రెండింటిలో ఒకటి ఫిక్స్ చేయనున్న చిరంజీవి
'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆయనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. అయితే, దీని తర్వాత చేసిన 'సైరా: నరసింహారెడ్డి' మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ హిట్ను తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు చిరంజీవి. ఇందులో భాగంగానే 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం 'ఆచార్య'. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో యూనిట్ క్లారిటీకి వచ్చేసిందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య'ను 2021 మే 14న కానీ, 21వ తేదీన కానీ విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు డేట్లలో ఒక దానిని ఎంపిక చేసే బాధ్యతను చిరంజీవికే వదిలేసిందట చిత్ర యూనిట్. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉందని టాక్.
ఇదిలా ఉండగా, దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాడే వ్యక్తి కథతో తెరకెక్కుతోంది 'ఆచార్య'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్గానూ, నక్సలైట్ గానూ కనిపించనున్నారు. అలాగే, ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. అతడి క్యారెక్టర్ దాదాపు ముప్పై నిమిషాల వరకూ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. చరణ్ సరసన కూడా ఓ హీరోయిన్ ఉంటుందని అంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అరవింద స్వామి ఇందులో విలన్గా చేస్తున్నారట.