Don't Miss!
- News
సస్పెన్స్ కు తెర దించనున్న కన్నా.. జనసేనలో చేరేది ఎప్పుడంటే!!
- Finance
కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం..
- Lifestyle
ఈ గుణాలున్న పురుషులు మంచి భాగస్వామి కాలేరు, అవేంటంటే..
- Sports
ICC Men's T20I Team of the Year 2022: భారత్ నుంచి ముగ్గురే.. రోహిత్కు దక్కని చోటు!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Ghost: ఒకే వేదికపై ముగ్గురు హీరోలు.. నాగార్జున ప్లాన్ అదిరిపోయిందిగా!
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్తోనే సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్, ఫైట్స్ ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తూ స్టార్గా వెలుగొందుతోన్నారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయన.. తక్కువ సమయంలోనే స్టార్డమ్ను అందుకున్నారు. ఫలితంగా ఈ హ్యాండ్సమ్ హీరో ఫాలోయింగ్, మార్కెట్ భారీగా పెరిగిపోయింది. దీంతో అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నారు. ఇలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న ఆయన.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నారు.
యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్లో అస్సలు తగ్గకుండా!
ఈ ఏడాది ఆరంభంలోనే 'బంగార్రాజు' మూవీతో హిట్ కొట్టిన అక్కినేని నాగార్జున.. ఇప్పుడు విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో 'ఘోస్ట్' అనే సినిమాను కంప్లీట్ చేసుకున్నారు. వాస్తవానికి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ, కొద్ది రోజుల తర్వాత ఇది పున: ప్రారంభించి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నారు. అంతేకాదు ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి రిలీజ్కు రెడీ చేశారు.

క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న 'ఘోస్ట్' సినిమాను అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సినిమా టీజర్తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. వీటికి అక్కినేని అభిమానులే కాకుండా.. అన్ని వర్గాల వాళ్ల నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది. ఫలితంగా ఇవన్నీ ట్రెండింగ్ అయిపోయాయి. అదే సమయంలో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు.
NTR University: జగన్, రాజశేఖర్ రెడ్డిపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. ఆ జంతువులతో పోలుస్తూ ఘాటుగా!
యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న 'ఘోస్ట్' మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను సెప్టెంబర్ 25న నిర్వహించబోతున్నారు. దీనికి కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ను వేదికగా నిర్ణయించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభం కాబోతున్న ఈ వేడుక కోసం ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ఇక, ఈ ఫంక్షన్కు అక్కినేని ఫ్యామిలీకి చెందిన యువ సామ్రాట్ నాగ చైతన్య, హ్యాండ్సమ్ గాయ్ అఖిల్ గెస్టులుగా రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇక, ఒకే వేదికపై ముగ్గురు హీరోలు కనిపించబోతుండడంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
'ఘోస్ట్' మూవీలో అక్కినేని నాగార్జున ఇంటర్పోల్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఇందులో ఆయనకు జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.