Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అనుష్క శర్మపై విమర్శలు: భర్తతో కలిసి ఆ ఫోటోలో ఉండటమే కారణం!
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, విరాట్ కోహ్లి పెళ్లికి ముందు అనేక ట్రోల్స్ జరిగాయి. అనుష్క ఏదైనా మ్యాచ్కు హాజరైనపుడు ఇండియా ఓడిపోతే అంతా అనుష్కను ఆడిపోసుకునేవారు. నీ మాయలో పడి కోహ్లి సరిగా మ్యాచ్ ఆడలేకపోతున్నాడు అని విమర్శించేవారు. తర్వాత ఈ ఇద్దరూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా అనుష్క, విరాట్ మీద మరోసారి విమర్శలు వెళ్లువెత్తాయి. అందుకు కారణం... టీమిండియా అఫీషియల్ ఫోటోలో అనుష్క శర్మ దర్శనమివ్వడమే. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
లండన్లోని భారత హైకమిషన్ ఆహ్వానం మేరకు టీమ్ మొత్తం కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అనుష్క కూడా కోహ్లితో కలిసి అక్కడకు వెళ్లింది. ఇక్కడ టీమ్ అంతా కలిసి దిగిన ఫోటోను బీసీసీఐ ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ఆ ఫోటోలో అనుష్క ఉండటంతో విమర్శలు మొదలయ్యాయి.
టీమిండియా అఫీషియల్ పర్యటనలో అనుష్క ఉండటం ఏమిటి? ఆమె ఏమైనా జట్టులో సభ్యురాలా? లేక టీమిండియా వైస్ కెప్టెనా? అంటూ కొందరు మండి పడ్డారు. మరికొందరైతే ఇది క్రికెట్ టూర్ మాదిరిగా అనిపించడం లేదని, కోహ్లి-అనుష్క హనీమూన్ టూర్ లా ఉందంటూ ఘాటుగా విమర్శించారు.