ఇంటి సభ్యులు ఫైట్ ఇవ్వకపోతే.. నా కసి పెరిగేది కాదు.. కౌశల్
బిగ్బాస్ తెలుగు 2 రియాలిటీ షో ఘనంగా ముగిసింది. చివరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో కౌశల్ మండా విజేతగా నిలిచారు. గీతా మాధురి రన్నరప్గా నిలిచారు. ఆదివారం సాయంత్రం ప్రసారమైన ఫైనల్ లైవ్లో టాప్ ఐదుగురిలో తొలుత సామ్రాట్ ఇంటి నుంచి నిష్రమించగా.. ఆ తర్వాత దీప్తి నల్లమోతు, తనీష్ ఇంటి నుంచి బయటకు వచ్చారు.
విజేతను ప్రకటించమని అడుగగా.. వెంకటేష్ బిగ్బాస్లో నాని జర్నీని చూపించమని అడిగాడు. దాంతో బిగ్బాస్ తెలుగు 2లో నాని లైఫ్ జర్నీ చూపించారు. చాలా ఉద్వేగభరితంగా వీడియో సాగింది. అనంతరం నాని విజేతన ప్రకటించడానికి ట్రై చేసి నాతో కాదు అని వెళ్లిపోగా.. వెంకటేష్ వచ్చి విజేతను ప్రకటించారు. కౌశల్ చేయిని పైకి ఎత్తి విజేత అని ప్రకటించడానికి ప్రయత్ని కదరదు అని అన్నారు. నాని టీవీలో విజేతను ప్రకటించడంతో కౌశల్ ఉద్వేగాని గురయ్యాడు. అనంతరం ఆడియెన్స్లోకి వెళ్లి తండ్రిని కౌగిలించుకొని ఆనందంలో మునిగిపోయాడు.

క్యాన్సర్ రోగులకు 50 లక్షలు
క్యాన్సర్ రోగులకు 50 లక్షల విరాళం
హైదరాబాద్లో జీరోతో అడుగుపెట్టాను. అంచెలంచెలుగా ఎదుగుతూ బిగ్బాస్ విజేతగా నిలిచాను. ప్రేక్షకులకు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకొంటాను. నాకు లభించిన 50 లక్షల పారితోషికాన్ని మా అమ్మ ఫౌండేషన్కు విరాళంగా ఇస్తాను. మా అమ్మ క్యాన్సర్తో మరణించారు. క్యాన్సర్ వ్యాధితో ఏ తల్లి బాధకుండా ఈ డబ్బును ఉపయోగిస్తాను అని కౌశల్ తెలిపారు.
నాలో కసిని పెంచారు.
హౌస్మేట్స్ కసిని పెంచారు.
నాను విజేతగా నిలువడానికి ప్రధాన కారణం నా తోటి సెలబ్రిటీలు. వాళ్లు నాకు గట్టిపోటి ఇవ్వకపోతే నాకు నాలో ఇంత కసి పెరిగేది కాదు. వాళ్లందరూ నాలో కసిని పెంచడంతోనే విజేతగా నిలువాలని మరింత ప్రయత్నించాను.


Click it and Unblock the Notifications











