Just In
- 10 min ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 10 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 11 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 11 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
Don't Miss!
- News
ఉలిక్కిపడ్డ విశాఖ: మరో భారీ అగ్నిప్రమాదం: రాత్రంతా: ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఉదయం ఇచ్చిన మాట.. సాయంత్రానికే నెరవేర్చిన సోనూ సూద్.. ఆ తెలుగు రైతు కోసం..
ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే స్తోమత ఉండి కూడా మౌనంగా అయ్యో పాపం అనే కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు. 100రూపాయల్లో రూపాయి దానం చేయడానికి కూడా ఒప్పుకోరు. ఒక్కరి చేస్తే అందరూ అడుగుతారనే బయమో లేక.. మరో ఆలోచన ఉంటుందో తెలియదు గాని వరుస సహాయాలు చేయడానికి కాస్త సందేహిస్తారు. కానీ సోనూ సూద్ మాత్రం ఎంత ఇచ్చిన తప్పులేదు అన్నట్లుగా తనవంతు సహాయంగా పేదల కోసం ఖర్చు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఒక రైతు కోసం ఉదయం ఇచ్చిన మాటను సాయాత్రని కల్లా నెరవేర్చాడు.

లాక్ డౌన్ లో సహాయాలు..
కరోనా కష్ట కాలంలో చాలా వరకు సెలబ్రెటీస్ ఫండ్స్ ఇచ్చేసి ఒక పనైపోయింది అన్నట్లుగానే ఉన్నారు. కానీ సోనూ సూద్ మాత్రం అలా సైలెంట్ గా ఉండలేదు. డైరెక్ట్ గా రంగంలోకి దిగి వలస కూలీలను ఇంటికి చేర్చాలని ఒక స్పెషల్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు. వేల మందిని పైగా బస్సులతో, చార్టెట్ ఫ్లైట్ లలో వారి గమ్యాలకు చేర్చాడు.

పేద రైతు కష్టాన్ని చూసి..
అయితే రీసెంట్ గా ఒక తెలుగు రైతు కష్టాన్ని చూసి సోనూ సూద్ చలించిపోయారు. కనీసం ఎడ్లను అద్దెకు తెచ్చుకొని వ్యవసాయం చెసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆ రైతు తన ఇద్దరి కుతుళ్ళను జోడెద్దులుగా మార్చి పొలాన్ని దున్నిన వైనం అందరిని షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో వారు పొలం దున్నుతున్న వీడియో వైరల్ కావడంతో సోనూ సూద్ స్పందించాడు.

కుతుళ్ళతోనే నాగలి..
చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండల్లానికి చెందిన పేద రైతు నాగేశ్వరరావు ఇటీవల టమాట పంట వేసి తీవ్రంగా నష్టపోయారు. ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో మరోధారి లేక కుతుళ్ళతోనే నాగలి పట్టించి పొలం దున్నాడు. విషయం తెలుసుకున్న సోనూ సూద్ వారికి ట్రాక్టర్ కొనిస్తాను అని ఆదివారం ఉదయం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

మాట నిలబెట్టుకున్న సోనూ సూద్
ఉదయం అలా మాట ఇచ్చాడో లేదో సాయంత్రాని కల్లా ట్రాక్టర్ ఆ కుటుంబం దగ్గరకు వచ్చేసింది. దీంతో ఆ ఫ్యామిలీ చాలా ఆనందానికి లోనవుతోంది. ఇక సోనూ సూద్ చేసిన మంచి మనికి మరోసారి అభిమానులు సోషల్ మీడియాలో జేజేలు కొడుతున్నారు. రియల్ లైఫ్ లో అతను నిజమైన హీరో అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.