Don't Miss!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మెగాస్టార్ మీద కేంద్రమంత్రి ప్రసంశల వర్షం.. చిరు స్పందన ఎంటో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి గత కొద్ది రోజులుగా కరోనా వల్ల ఇబ్బందులు పడుతూ ఆక్సిజన్ అందక చనిపోతున్న వారిని కాపాడుకునేందుకు గాను చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లాలోను ఈ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు అయ్యాయి. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆక్సిజన్ అందిస్తూ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు సేవలు కొనసాగుతున్నాయి.
అయితే ఇప్పటిదాకా చిరంజీవి అందిస్తున్న ఈ సేవలకు సంబంధించి రాజకీయ వర్గాల నుంచి అలాగే మీడియా వర్గాల నుంచి పెద్దగా స్పందన లేకపోయినా తాజాగా సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మానవ జీవితాన్ని కాపాడటమే మానవత్వానికి గొప్ప సేవ అని పేర్కొన్న ఆయన సూపర్ స్టార్ మరియు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి చేస్తున్న నిస్వార్ధమైన సేవ హృదయానికి తాకేలా ఉందని పేర్కొన్నారు. ఈ కరోనా మహమ్మారి సమయంలో చిరంజీవి గారు అలాగే ఆయన బృందం చాలా విలువైన ప్రాణాలను రక్షించడాకి సహాయపడింది అని ఆయన పేర్కొన్నారు.
ఇక కిషన్ రెడ్డి ట్వీట్ కి చిరంజీవి కూడా తాను స్పందించారు. మీ దయ గల మాటలకు ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారు అని పేర్కొన్న చిరంజీవి సంక్షోభం ఇంతలా విజృంభిస్తున్న ఈ సమయంలో నేను చేయగలిగిన చిన్న సహాయం చేస్తున్నానని వినమ్రంగా స్పందించారు.
నిజానికి చిరంజీవి చేస్తున్న సేవలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం వరకు మీడియా కానీ రాజకీయ వర్గాలు గాని ఏమీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ అధినేత చిరంజీవి తో మాట్లాడిన ఒక ఫోన్ కాల్ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. ఆ తరువాత మీడియాలో కధనాలు రావడం మొదలు కాగా ఇప్పుడు ఎట్టకేలకు చిరంజీవి చేస్తున్న సేవకు రాజకీయ నేతల నుంచి కూడా గుర్తింపు దక్కినట్లు అయింది.