Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘సైమా’ వేడుకకు మరింత గ్లామర్... ముఖ్య అతిథులుగా చిరంజీవి, మోహన్ లాల్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2019 వేడుక ఈ సారి ఖతార్లో వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 15, 16 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో సౌతిండియాలోని నాలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్లెు సందడి చేయబోతున్నారు.
ఈ సారి సైమాకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హాజరు కాబోతున్నారు. ఈ ఇద్దరి రాకతో ఈ షోకు మరింత గ్లామర్ వస్తుందని, గతంలో ఎన్నడూ లేనంత గ్రాండ్గా ఈ షో చేయబోతున్నట్లు సైమా నిర్వాహకులు ప్రకటించారు.
ఈ సైమా అవార్డుల్లో రంగస్థలం చిత్రం అత్యధికంగా 12 కేటగిరీల్లో నామినేట్ అయింది. మహానటి చిత్రాని 9 నామినేషన్స్, గీత గోవిందం మూవీకి 8 నామినేషన్స్, అరవింద సమేతకు 6 నామినేషన్స్ వచ్చాయి. ఎవరికి ఏ అవార్డు దక్కుతుంది, ఏ మూవీ ఎన్ని అవార్డులు దక్కించుకుంటుంది అనేది ఆగస్టు 15, 16 తేదీల్లో తేలనుంది.
కేవలం తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మాత్రమే కాదు... కన్నడ, మలయాళం, తమిళ చిత్రాలకు కూడా అవార్డుల ప్రధానం జరుగబోతోంది. ఖతార్లో రెండు రోజుల పాటు వైభవంగా జరిగే ఈ వేడుకకు ఈ సారి వీలైనంత ఎక్కువ మంది స్టార్లను తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.