Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సినిమా బతకాలి.. షూటింగులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే థియేటర్ల ఓపెన్!
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినిమారంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు.
సినిమా షూటింగులు, థియేటర్ల ఓపెన్
టాలీవుడ్లో సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని కోరుకొంటున్నాం అని తన అభిప్రాయాన్ని సీఎం స్పష్టం చేశారు.
కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా
కరోనా
లాక్
డౌన్
నిబంధనలు,
కోవిడ్
వ్యాప్తి
నివారణ
మార్గదర్శకాలు
పాటిస్తూ
షూటింగులు
నిర్వహించేలా
ఎవరికి
వారు
నియంత్రణ
పాటించాల్సి
ఉంటుందని
ముఖ్యమంత్రి
సూచించారు.
సినిమా
షూటింగులు
ఎలా
నిర్వహించుకోవాలనే
విషయంలో
విధి
విధానాలు
రూపొందించాలని
సిఎం
అధికారులను
ఆదేశించారు.
సినిమా
పరిశ్రమపై
ఆధారపడి
లక్షలాది
మంది
జీవిస్తున్నందున
రీ
ప్రొడక్షన్,
షూటింగు
నిర్వహణ,
థియేటర్లలో
ప్రదర్శనలను
దశలవారీగా
పునరుద్ధరించాల్సిన
అవసరం
ఉందని
సిఎం
అభిప్రాయపడ్డారు.
తక్కువ మందితో పనులు..
లాక్ డౌన్ నిబంధనలకు అనుకూలంగా తక్కువ మందితో, ఇండోర్లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవచ్చు. ఆ తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకొంటాం. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటాం. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
త్వరలోనే షూటింగులపై విధానపరమైన నిర్ణయం
ఎంత
మందితో
షూటింగులు
నిర్వహించుకోవాలి?
ఎలాంటి
జాగ్రత్తలు
తీసుకోవాలి?
తదితర
అంశాలపై
సినిమాటోగ్రఫీ
శాఖ
మంత్రి,
ప్రభుత్వ
ప్రధాన
కార్యదర్శితో
సమావేశమై
చర్చించాలని
సినీ
రంగ
ప్రముఖులను
ముఖ్యమంత్రి
కేసీఆర్
కోరారు.
ఆ
తర్వాత
ప్రభుత్వం
ఖచ్చితమైన
మార్గదర్శకాలు
రూపొందించి,
షూటింగులకు
అనుమతి
ఇస్తుంది.
కొద్ది
రోజులు
షూటింగులు
నడిచిన
తర్వాత,
అప్పటికే
పరిస్థితిపై
కొంత
అంచనా
వస్తుంది
కాబట్టి,
సినిమా
థియేటర్లు
ఓపెన్
చేసే
విషయంపై
నిర్ణయం
తీసుకుంటాం
అని
కేసీఆర్
హామీ
ఇచ్చారని
సినీ
ప్రముఖులు
మీడియాకు
చెప్పారు.