సుశాంత్ కేసులో ఈడీ జోక్యం చేసుకోవాలి... మనీలాండరింగ్పై దేవేంద్ర ఫడ్నవీస్ అనుమానాలు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు దర్యాప్తులో శివసేన పార్టీ నేత జోక్యం కల్పించుకోంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సుశాంత్ మరణం వెనుక వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే యువ హీరో ఆత్మకు శాంతి లభిస్తుంది అని ఫడ్నవీస్ అన్నారు.
సుశాంత్ ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం ఆరోపణల వస్తున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రంగంలోకి దిగాలి అని సూచించారు. డబ్బు పెద్ద ఎత్తున్న దుర్వినియోగం జరిగినట్టు అనుమానాలు రేకెత్తుతున్న క్రమంలో మానీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్)ను ఈడీ దాఖలు చేయాలని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

సుశాంత్ మరణం విషయంలో భారీగా ప్రజల సెంటిమెంట్ బలపడుతున్నది. ఈ కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్న క్రమంలో బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం విషయంలో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో విచారణ జరపడానికి ఈసీఐఆర్ను ఈడీ రిజిస్టర్ చేయాలి అని దేవేంద్ర పఢ్నవీస్ ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొన్నది.
సుశాంత్ సింగ్ బ్యాంక్ అకౌంట్లోని రూ.17 కోట్లలో సుమారు రూ.15 కోట్లు రియా చక్రవర్తి కుటుంబం కాజేసిందని హీరో తండ్రి కేకే సింగ్ ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేయడం సంచలనం రేపిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











