Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరోనాపై బిగ్ ఫైట్: ముందుకొచ్చిన మైత్రి మూవీ మేకర్స్.. రెండు రాష్ట్రాలకు విరాళం
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్దఎత్తున సహాయక చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా వైద్యబృందాలు ప్రాణాలకు తెగించి రేయింబవళ్లు కష్టపడుతున్నాయి. ఓ వైపు కేసులు పెరుగుతున్నా.. రోజురోజుకీ కరోనాపై పోరాటాన్ని ఉదృతం చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
కరోనా కట్టడిలో భాగంగా సహాయక చర్యలు చేపడుతూ ప్రభుత్వాలు చేస్తున్న ఈ సేవలో తామూ భాగం అవుతాం అంటూ ముందుకొస్తోంది టాలీవుడ్ సినీ లోకం. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ తమ ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తూ గొప్పమనసు చాటుకుంటున్నారు. నితిన్ తో ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.
"Everything will be okay in the end. If it's not okay, it's not the end."
— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2020
We wish to support our Governments in a small way possible in these testing times!#StayHome #StaySafe and Don't forget to Maintain Social Distancing! #IndiaFightsCorona pic.twitter.com/2kYcV2vbna
ఇప్పటికే నితిన్, చిరంజీవి, కొరటాల శివ, సుకుమార్, సాయి ధరమ్ తేజ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, దిల్ రాజు, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఎందరో ప్రముఖులు ఆర్ధిక సాయం ప్రకటించగా తాజాగా బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యం కూడా ముందుకొచ్చింది.
తమ వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 లక్షల ఆర్ధిక సాయం ఇవ్వనున్నట్లు అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. తెలంగాణ సీఎం రీలీఫ్ ఫండ్కి 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కి మరో 10 లక్షలు ఆర్థికసాయం అందించబోతున్నామని ప్రకటించింది.