Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హృదయం ముక్కలైంది.. దర్శకుడి మృతిపై మాధవన్ ఎమోషనల్
2020లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. సినీ ప్రముఖులు వెంట వెంనటే నేల రాలుతున్నారు. ఈ ఏడాది రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ వంటి దిగ్గజాల మరణంతో మొదలై.. నేటికీ ఎవరినో ఒకరిని బలి తీసుకుంటూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ దర్శకడు నిషికాంత్ కామత్ మరణించారు. అయితే ఈయన మరణ వార్తలపై నిన్న జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉండగానే చనిపోయారనే వార్తలు దావానంలా వ్యాపించాయి.
దీంతో కొందరు సెలెబ్రిటీలు మీడియాపై ఫైర్ అయ్యారు. నిషికాంత్ బతికే ఉన్నారనే విషయాన్ని తెలుసుకోలేక తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయని రితేష్ దేశ్ ముఖ్ వంటి హీరోలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేయ సంబంధింత క్యాన్సర్తో బాధపడుతున్న నిషికాంత్ నిన్న రాత్రి ప్రాణాలు విడిచారు. ఈ మేరకు తన దర్శకుడి మృతిపై మాధవన్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించాడు.

మలయాళీ దృశ్యం సినిమాను హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిషికాంత్ మొదటగా మరాఠీలోఓ చిత్రాన్ని చేశారు. నిషికాంత్ మరాఠీలో చేసిన మొదటి చిత్రం డాంబివాలి ఫాస్ట్ను తమిళంలో మాధవన్తో రీమేక్ చేశారు. మాధవన్ హీరోగా ఎవనో ఒరువాన్ అంటూ తెరకెక్కించగా అది సూపర్ హిట్ అయింది. ఇలా తన దర్శకుడి అకాల మరణంతో మాధవన్ ఎమోషనల్ అయ్యాడు. హృదయం బద్దలైంది.. స్వర్గం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.. మిమ్మల్ని, మీ పాజిటివ్ నేచర్ను ఎప్పుడూ మిస్ అవుతాం మై డియర్ బ్రో. నా కెప్టెన్కు ఇదే వీడ్కోలు, ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ పోస్ట్ చేశాడు.