Don't Miss!
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఎంపీ కవిత చేతుల మీదుగా విమెన్ ఆఫ్ రిథమ్ పోస్టర్
మహిళా వాద్యకారుల ప్రతిభని గుర్తించడానికి, గౌరవించడానికి 'విమెన్ ఆఫ్ రిథమ్' అనే కాన్సెప్ట్తో కాన్సర్ట్ సిరీస్ సంగీత కచేరి నిర్వహిస్తున్నది. ఈ సంస్థ దేశంలో మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నది. కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించే టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇటీవల హైదరాబాద్ కాన్సర్ట్ పోస్టర్ని విడుదల చేశారు. మహిళా కళాకారులను ప్రొత్సహిస్తున్నందుక బందాన్ని ఆమె అభినందించారు.
'విమెన్ ఆఫ్ రిథమ్' మొదటి 3 సీజన్స్లో దేశంలోని ప్రముఖ మహిళా పెర్క్యూసన్ వాద్యకారులలో 20 మంది పలు కచేరీలలో తమ ప్రతిభ ప్రదర్శించారు. డ్రమ్స్లో అనన్య పాటిల్, ఘటంలో సుకన్య రామగోపాల్, మహీవా ఉపాధ్యాయ్, సవని తల్వాల్కర్, పఖవజ్ మరియు తబలా, చారు చైల్డ్ ప్రాడిజీ రాహితా, చందా లాంటి అనేక మంది ఇందులో పాల్గొన్నారు.
మార్చి 10, సాయంత్రం 7 గంటల నుంచి సిసిఆర్టి అంఫి థియేటర్, మాదాపూర్లో జరిగే 4వ ఎడిషన్లో అత్యుత్తమ మహిళా సంగీతకారులు పాల్గొంటారు. విజయవాడకు చెందిన దండమూడి సమ్మతి రామమోహరావు మృదంగం, సుకన్య రామ్గోపాల్ ఘటం, మిథాలి ఖర్గోవన్కర్ తబలా, డెబోప్రియ రణదీవ్ ఫ్లూట్, చందనా బాల గాత్రంతో హైదరాబాద్ ప్రేక్షకులను సమ్మోహనపర్చనున్నారు.
'విమెన్ ఆఫ్ రిథమ్' సీజన్ 4ను ఎలెవెన్ పాయింట్ టూ సంస్థ హోస్ట్ చేస్తోంది. 'ఎలెవెన్ పాయింట్ టూ' ఇంతకుముందు ఇళయరాజా, శోభన, కెజె ఏసుదాస్ ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్కి చెందిన 'మోటివిటీ ల్యాబ్స్'తో కలిసి 'ఎలెవన్ పాయింట్ టూ' ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.. ఎటువంటి ఎంట్రీ ఫీ లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.