నయనతార మాయాజాలం వసంతకాలం.. ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు
లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ వసంత కాలం పేరుతో తెలుగులో రిలీజ్కు సిద్దమవుతున్నది. ఈ చిత్రాన్ని యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ప్రేక్షకులకు అందిస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడి తదితరులు నటించారు. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రం (ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంతకుముందు 'ఏకవీర, వెంటాడు-వేటాడు" వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. "టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగిన నయనతార నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 'వసంతకాలం'. సస్పెస్న్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది.. అన్నారు!!

తమిళంలో ఈ చిత్రం కోలైయుత్తీర్ కాలం అనే మూవీ టైటిల్తో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. వెండితెరపై ఈ చిత్రం మెప్పించడమే కాకుండా భారీగా కలెక్షన్లను రాబట్టింది. 2019 ఆగస్టు 9వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో అదించాలనే ప్రయత్నానికి వీఎస్ఎస్ శ్రీనివాస్ నాంది పలికారు.


Click it and Unblock the Notifications











