Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్గా!
Don't Miss!
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘జాన్’లో ప్రభాస్ రోల్ లీక్.. యంగ్ రెబెల్ స్టార్ వాటన్నింటినీ మాయం చేసేస్తాడట
'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్కు పేరు రావడంతో పాటు మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది. దీంతో ప్రభాస్ సినిమాలకు భారీ క్రేజ్ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల అతడు నటించిన సినిమాను దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేశారు. ప్రస్తుతం అతడు నటిస్తున్న సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్..?

అనుకున్నదొకటి.. అయింది మరొకటి
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘సాహో' అనే సినిమా చేశాడు. దాదాపు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఊహించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో అతడి ఫ్యాన్స్కు నిరాశ.. నిర్మాతలకు నష్టాలు మిగిలాయి. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించింది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు
పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘సాహో' తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘జాన్'. 1960వ దశకం నాటి కథతో వస్తున్న ఈ మూవీని ‘జిల్' ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. పిరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో ప్రభాస్ను లవర్ బాయ్గా చూపించబోతున్నారు.

ప్రభాస్ గ్యాప్ ఎందుకు ఇచ్చాడు?
వాస్తవానికి ‘సాహో'కు ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. యూరప్లో కొన్ని సన్నివేశాలు సైతం చిత్రీకరించారు. కానీ, వాటిని అలా వదిలేసి సరికొత్తగా స్టార్ట్ చేశారు. ఈ షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. దీంతో ప్రభాస్ విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు ఫారెన్ టూర్లో బిజీగా ఉన్నాడు. అతడు గ్యాప్ ఎందుకు తీసుకున్నాడని చర్చ జరుగుతోంది.

ఒకటి కాదు.. ఎన్నో వైరల్ అయ్యాయి
పూర్తి లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నటించే ఆర్టిస్టుల గురించి మాత్రమే కాకుండా.. ఈ సినిమా స్టోరీ లీక్ అయిందని కూడా ప్రచారం జరిగింది. అలాగే, ఇందులో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని కూడా టాక్ ఉంది. దీంతో ఈ చిత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది.

‘జాన్'లో ప్రభాస్ రోల్ లీక్
తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ రోల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఈ స్టార్ హీరో దొంగగా కనిపించబోతున్నాడనేదే ఆ వార్త సారాంశం. ఇందులో అతడు పాత కాలపు కార్లు, బైకులు దొంగతనం చేస్తుంటాడని అంటున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రేమలో పడడం.. ఆమె కోసం దొంగతనాలు మానేయడం చేస్తాడనే టాక్ వినిపిస్తోంది.