Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘లైగర్’ కోసం స్పీడు పెంచిన పూరీ: విజయ్ను అక్కడకు తీసుకెళ్లేందుకు ప్లానింగ్
కొంత కాలంగా హిట్ అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటోన్నాడు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రం 'లైగర్'. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు పూరీ జగన్నాథ్. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా రేంజ్ కావడంతో 'లైగర్' మూవీ షూటింగ్ ముంబై నగరంలో ప్రారంభం అయింది. అక్కడ చిత్రీకరణ జరుపుతోన్న సమయంలోనే లాక్డౌన్ కారణంగా పలుమార్లు ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ ఇండియాలో చేయాల్సిన షెడ్యూల్ మొత్తాన్ని కంప్లీట్ చేశారట. తాజా సమచారం ప్రకారం.. 'లైగర్' మూవీ ఫైనల్ షెడ్యూల్ను యూరప్లో ప్లాన్ చేశాడట పూరీ జగన్నాథ్. ఇందుకోసం ప్రస్తుతం లొకేషన్లను వెతికే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఒక్కసారి షూట్ ఫిక్స్ అయితే.. సింగిల్ షెడ్యూల్లో టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఇదంతా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
'మా' ప్రెసిడెంట్గా నందమూరి బాలకృష్ణ: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. అందుకే వెయింటింగ్ అంటూ!
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'లైగర్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్గా నటిస్తున్నాడు. అందుకోసం అతడు చాలా రోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది.