Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
శ్రీదేవి కోసం అనిల్ కపూర్ అప్పట్లో పెద్ద రిస్క్ తీసుకున్నాడు: అందుకే అపుడు కలిసి....
నాలుగేళ్ల వయసులోనే నటించడం మొదలు పెట్టిన శ్రీదేవి క్రమ క్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్స్టార్ హీరోయిన్గా ఎదిగారు. 4 దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. అప్పట్లో శ్రీదేవితో కలిసి నటించడం అనేది ప్రతి యాక్టర్ డ్రీమ్. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, శ్రీదేవి కలిసి తొలిసారి 'మిస్టర్ ఇండియా'లో కలిసి నటించిన సంగతి తెసిందే. ఈ సినిమాకు సైన్ చేసిన ఆయన అప్పట్లో పెద్ద రిస్క్ తీసుకున్నారు.
అనిల్ కపూర్ ఏం చెప్పారంటే
గతంలో జరిగిన 17వ మియామి ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెస్ కాన్ఫరెన్సులో అనిల్ కపూర్ మాట్లాడుతూ.... ‘మిస్టర్ ఇండియా' సినిమాకు సైన్ చేయడానికి కేవలం శ్రీదేవి కారణమని తెలిపారు. ఆ స్క్రిప్టు తనకు అంతగా నచ్చకపోయినా కేవలం శ్రీదేవి ఈ చిత్రంలో నటిస్తుందనే ఒకే ఒక కారణంతో రిస్క్ చేసినట్లు వెల్లడించారు.
ఆ సమయంలో శ్రీదేవి పెద్ద స్టార్
ఒక నటుడి కెరీర్ మీద జయాపజయాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఏదైనా తేడా వచ్చి సినిమా పోతే కెరీర్ స్పాయిల్ అవుతుంది. కానీ ఆ సమయంలో శ్రీదేవి ఇండియాలోనే పెద్ద సూపర్ స్టార్. ఆమెతో కలిసి నటిస్తే తన స్థాయి కూడా పెరుగుతుందనే ఒకే ఒక నమ్మకంతో రిస్క్ తీసుకున్నట్లు అనిల్ కపూర్ తెలిపారు.
Recommended Video
శ్రీదేవి ఫేవరెట్ కోస్టార్ ఎవరంటే...
స్టార్ డస్ట్ ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు? అనే ప్రశ్నకు శ్రీదేవి స్పందిస్తూ.... ‘అందరూ' అంటూ సమాధానం ఇచ్చారు. ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలని కోరగా ‘అనిల్ కపూర్' అని రిప్లై ఇచ్చారు.
అందుకే అనిల్ కపూర్ అంటే ఇష్టం
అనిల్ కపూర్ అంటే ఎందుకు ఇష్టం అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ...... అతడు చాలా బాగా మాట్లాడతాడు, ఆసక్తికర విషయాలు పంచుకుంటాడు అని శ్రీదేవి వెల్లడించారు.
ఇపుడు జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి
ఇప్పుడు శీదేవి మన మధ్య లేరు. ఆమె జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్లో ఆమె బాత్ టబ్ లో పడి మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె మరణం వెనక అసలు వాస్తవం ఏమిటనేది ఇప్పటికీ ఈ ప్రపంచానికి తెలియలేదు.
సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో
శ్రీదేవి మరణంపై సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. దుబాయ్ పోలీసులు ఆమె మరణాన్ని ప్రమాద వశాత్తు జారి పడిపోవడం వల్ల సంభవించిన మరణం అని తేల్చారు. అయితే శ్రీదేవి మరణం ముందు, వెనక జరిగిన పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
దేశం మొత్తం విషాదంలో
ఇండియన్ సినిమా పరిశ్రమ భాషా ప్రాతిపదికన, ప్రాంతాల వారికిగా వేర్వేరుగా ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైనా చనిపోతే ఆయా ప్రాంతాల్లో మాత్రమే విషాదం ఉంటుంది. అయితే శ్రీదేవి అన్ని బాషాల్లోనూ నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.